ఆర్ ఎక్స్ 100తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి  టాలీవుడ్ లో కి సెన్సేషనల్ ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో కార్తికేయ. అయితే ఈ సినిమా తరువాత హిప్పీ అనే సినిమా తో  భారీ డిజాస్టర్ ను చవిచూడగా ఆ తరువాత  గుణ 369 కూడా కార్తికేయ కు కావాల్సిన  హిట్ ఇవ్వలేకపోయింది. ఇక ఆయన హీరోగా నటించిన నాలుగవ చిత్రం  90ఎంఎల్ కూడా గత ఏడాది విడుదలై  హిప్పీ తరువాత   ఆ రేంజ్ లో పరాజయాన్ని చవిచూసింది. ఈ సినిమా శాటిలైట్ హక్కులను స్టార్ మా సొంతం చేసుకోగా డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్  దక్కించుకుంది. అయితే ఈ నెల 2వ తేదిన స్టార్ మా ,90ఎంఎల్ ను మొదటి సారి ప్రసారం  చేయగా 10.92 టీఆర్పీ  వచ్చింది. ఒక్క చిన్నసినిమాకు పైగా  డిజాస్టర్ అయిన సినిమాకు ఈ రేంజ్ లో రేటింగ్స్ రావడం గొప్ప విషయమే. 
 
ఇక ఆర్ ఎక్స్ 100 తరువాత వరుస పరాజయాలను చవి చూసిన కార్తికేయ , గ్యాంగ్ లీడర్ లో  విలన్ రోల్ లో కూడా నటించాడు అయితే ఈసినిమా విజయం సాదించలేకపోయిన  కార్తికేయ కు నటుడి గా మంచి పేరును తీసుకొచ్చింది. ఈ సినిమా తరువాత మళ్ళీ అతను హీరోగా  సినిమా చేయడానికి సిద్దమవుతున్నాడు. అందులో భాగంగా గీతా ఆర్ట్స్  2 బ్యానర్ లో  కార్తికేయ  తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. నూతన దర్శకుడు కౌశిక్ డైరెక్ట్ చేయనున్న ఈ చిత్రానికి  'చావు కబురు చల్లగా' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ  ఏడాది ద్వితీయార్థం లో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ చిత్రాన్ని బన్నీ వాసు నిర్మించనుండగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా  వ్యవహరించనున్నారు. మరి ఈసినిమా తోనైనా  కార్తికేయ సక్సెస్  ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: