టాలీవుడ్ లో ఇప్పుడు మెగా ప్రభంజనం నడుస్తుంది. ప్రస్తుతం మెగా ఫ్యామిలి నుండి వరుస సినిమాలు వస్తుండటం వల్ల అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. అయితే ఈ మధ్య కాలంలో మల్టీ స్టారర్ సినిమాలు ఎక్కువ క్రేజ్ తెచ్చి పెడుతున్నాయి. అందుకే టాలీవుడ్ హీరోలందరూ ఇప్పుడు ఆ బాట లోనే నడుస్తున్నారు. మెగా హీరోలు కూడా ఈ దారిలోనే నడుస్తూ గతంలో ఎవడు సినిమాకు అల్లు అర్జున్, రాం చరణ్ కలిసి పని చేసారు. అలాగే రాం చరణ్ సినిమాల్లో చిరంజీవి కూడా నటించారు.

 

అయితే అది గెస్ట్ రోల్ గానే చేస్తున్నారు కాని, ఫుల్ లెంత్ రోల్ గా చేయలేదు. అయితే ఈ నేపధ్యంలో ఇప్పుడు రాం చరణ్, పవన్ కళ్యాణ్ కలిసి ఒక సినిమా చేయనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వీరిద్దరూ కలిసి తెర పై కనువిందు చేయాలనేది అభిమానుల కల. ఇప్పటికి ఇది నెరవేరబోతుంది అని మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రాం చరణ్ నిర్మాతగా మారి కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా చిరంజీవి సినిమాలన్నిటిని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. 

 

ఈ క్రమంలో రాం చరణ్ కి, పవన్ కు ఉన్న అనుబంధం వల్ల పవన్ సినిమాలకు కూడా రాం చరణ్ నిర్మాతగా మారనున్నాడని సినీ వర్గాల కథనం. అయితే ఈ మధ్య కాలంలో వరుస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తన 30 వ సినిమాగా రానున్న విక్రం వేద సినిమా రీమేక్ చిత్రంలో రాం చరణ్ కూడా స్క్రీన్ షేర్ చేసుకుంటాడని వార్తలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయి. అయితే మొదట ఈ సినిమాలో పవన్, రవితేజ కలిసి నటిస్తారని తెలిసింది. అయితే రవితేజ కంటే రాం చరణ్ బెటర్ అని దర్శకులు సూచించారని ఇండస్ట్రీ టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: