తెలుగు ఇండస్ట్రీలో  మెగా అన్నదమ్ముల గురించి తెలియని వారుండరు. ఇండస్ట్రీలో తమ నటనతో ఎవరికి వారుగా క్రేజ్ ని సంపాదించుకున్నారు. అయితే వీరిలో పవన్ కళ్యాణ్, చిరంజీవి సినిమాల్లోనే కాక రాజకీయంగా కూడా అడుగు ముందుకి వేసి తమ సత్తా చాటుకున్నారు. సుదీర్ఘ సినీ ప్రయాణం తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించారు చిరంజీవి. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రిగా కూడా పని చేసిన చిరు సినిమాల మీద ఉన్న ఇష్టం తో మళ్ళి సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు. 

 

ఈ క్రమంలోనే ఇప్పుడు పవన్ కూడా పయనిస్తున్నారు. అయితే పవన్ రాజకీయ నాయకుడిగా ప్రజలతో ఏకం అవుతూనే, సినీ రంగంలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. అయితే తాజాగా చిరంజీవి, తమ్ముడు పవన్ కోసం కీలక రోల్ సెట్ చేయనున్నారు. వీరిద్దరూ కలిసి వెండి తెర పై కనిపించడమే కాక రాజకీయంగా బలంగా ముందుకు వెళతారు అని వార్తలు వస్తున్నాయి. చిరంజీవి ఆచార్య సినిమాతో బిజీగా ఉంటే, పవన్ వకీల్ సాబ్ తో బిజీగా ఉన్నారు. అయితే చిరు తర్వాత సినిమా లూసిఫర్ రీమేక్ లో పవన్ తో ముఖ్య మంత్రి  పాత్ర చేయించాలని చూస్తున్నారు చిరంజీవి. 

 

దాదాపు పదిహేను నిమిషాల పాటు ఉండే ఈ పాత్రలో తమ్ముడు అయితే బాగుంటుందని చిరంజీవి భావించారని తెలుస్తుంది. అయితే ఈ న్యూస్ మెగా అభిమానులకు పండగే. ఈ కీలక పాత్ర పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి కూడా ఉపయోగపడుతుందని చిరు ఆలోచనగా తెలుస్తుంది. తమ్ముడి కోసం చిరంజీవి ఎంత పెద్ద స్కెచ్ వేసాడో అని సినీ జనాల్లో చర్చ జరుగుతుంది. అయితే దీని గురించి చిత్ర యూనిట్ చర్చలు ముగిశాయి కాని పవన్ కళ్యాణ్ మాత్రం దీని గురించి ఇంకా స్పందించలేదు. ఇది ఎంత వరకు నిజమో చూడాలి…

మరింత సమాచారం తెలుసుకోండి: