టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలు తమకు కలిసి వచ్చిన డైరెక్టర్ లనే తమకు  లక్కి గా భావించి తర్వాత ఆఫర్స్ కూడా వారికే ఇస్తున్నారు. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ హిట్ కాంభో అని చెప్పవచ్చు. మరియు హరీష్, మాస్ మహారాజ రవితేజకు కూడా లక్కి అనే చెప్పాలి. అయితే మిరపకాయ్, గబ్బర్సింగ్ వంటి సినిమాలతో ఇండస్ట్రీలో షేక్ పుట్టించాడు. అప్పటి వరకు ప్లాప్స్ లో ఉన్న పవన్ కి గబ్బర్ సింగ్ సినిమాతో మళ్ళి క్రేజ్ తెచ్చిపెట్టాడు హరీష్. ఆ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం కూడా ప్లస్ అయ్యింది.

 

ప్రస్తుతం మళ్ళి ఇదే కాంభో లో పవన్ హీరోగా ఆయన 28 వ చిత్రం మైత్రి మూవీ మేకర్స్ సంస్థ వారు నిర్మిస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు కూడా దేవి శ్రీ ప్రసాదే మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేస్తారని హరీష్ వెల్లడించారు. ఈ నేపధ్యంలో ఈ ముగ్గురి కాంభినేషన్ లో వస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. అయితే ప్రేక్షకుల అంచనాలను ఏ మాత్రం తగ్గకుండా దర్శకుడు హరీష్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అయితే పవన్ వకీల్ సాబ్ సినిమాతో బిజీగా ఉన్నందున ఈ సినిమా వచ్చే ఏడాది కాని సెట్స్ పైకి వెళ్ళే చాన్స్ లేదు. 

 

అయితే ఈ సినిమా స్టార్ట్ అయ్యే లోపు హరీష్ మరో సినిమా చేసే అవకాశo ఉందంటూ పుకార్లు వస్తున్నాయి. అయితే దీని పై స్పందించిన హరీష్ పవన్ సినిమా అయ్యే వరకు వేరే సినిమా చేసే ఆలోచన లేదని స్పష్టం చేసారు. అయితే టైం ఉంటే మాత్రం ఒక వెబ్ సిరీస్ చేస్తానని వెల్లడించారు. ఈ మధ్య కాలంలో వెబ్ సిరీస్ లకు మంచి ఆదరణ లభిస్తుంది. దీనిలో భాగంగా ఇప్పుడు దర్శక, నిర్మాతలు, నటి నటులు అందరు ఆ వైపుగా అడుగులు వేస్తున్నారు. అదే దారిలో హరీష్ కూడా నడుస్తున్నారని ప్రచారం జరుగుతుంది. పవన్ నటిస్తున్న రెండు సినిమాలు పూర్తయ్యే లోపు వెబ్ సిరీస్ తీస్తాడేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: