భారతదేశ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ సినిమా ఎన్ని వండర్స్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. భారీ బడ్జెట్ సినిమా అయిన బాహుబలి మొదటి లో పార్ట్ వన్ రిలీజ్ అవ్వగా తరువాత రెండో భాగంలో కూడా సినిమా రిలీజ్ అయింది. బాహుబలి సినిమా 2 భాగాలు అదిరిపోయే విజయాన్ని సాధించాయి. భారతదేశ చలనచిత్ర రంగం యొక్క దమ్ము ఏంటో ప్రపంచవ్యాప్తంగా రుజువయింది. అంతే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ యొక్క కీర్తి కూడా బాహుబలి సినిమాతో పెరిగిపోయిన విషయం అందరికీ తెలిసినదే. ఇప్పుడు అదే విధంగా డైరెక్టర్ శంకర్ కూడా బాహుబలి ఫార్ములానే అనుసరిస్తూ భారతీయుడు 2 సినిమా చేస్తున్నట్లు అర్థమవుతోంది.

 

ఫిల్మ్ ఇండస్ట్రీ నుండి వస్తున్న సమాచారం ప్రకారం శంకర్‌ దర్శకత్వంలో కమల్‌ హాసన్‌ నటిస్తున్న 'ఇండియన్‌ 2' చిత్రం రెండు పార్ట్‌లుగా రాబోతుందట. సినిమా కథ పెద్దగా ఉండటంతో పాటు బడ్జెట్‌ విషయంలో పరిధి దాటుతున్న కారణంగా ఈ చిత్రంను రెండు పార్ట్‌లుగా విడుదల చేస్తేనే అన్ని విధాలుగా బాగుంటుందనే అభిప్రాయంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ఉన్నారట.  ఇదే సమయంలో లాక్‌డౌన్‌ ఎత్తివేసిన వెంటనే డైరెక్టర్ శంకర్ షూటింగ్ ఏర్పాట్లు చేయాలని డిసైడ్ అయ్యారు.

 

సినిమా మొదలు పెట్టిన నాటి నుండి ఏదో రూపంలో అడ్డంకులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల కొన్ని రోజుల క్రితం సినిమాకి సంబంధించిన భారీ సెట్ లో క్రేన్‌ యాక్సిడెంట్‌ అవ్వడం యాక్సిడెంట్ లో కొంత మంది చనిపోవడం అదేవిధంగా మరికొంత మందికి గాయాలు కావడం జరిగింది. పెద్ద కేసు కూడా అవగా ఇక ఇండియన్‌ 2 సినిమా ఆగిపోయినట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించిన నిర్మాతలు ఆ వార్తలను కొట్టి పారేసి త్వరలోనే షూటింగ్ మళ్లీ జరుగుతున్నట్లు క్లారిటీ ఇచ్చారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: