టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ సినిమా వస్తుంది అనగానే ప్రేక్షకులకు ముందు నుంచి ఒకరకమైన క్రేజ్ అనేది ఉంటుంది. అతని సినిమా వస్తుంది అంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురు చూస్తూ ఉంటారు. టెంప‌ర్ సినిమాకు ముందు వ‌ర‌కు ఎన్టీఆర్ కెరీర్ కాస్త ఊగిస‌లాడుతూ ఉండేది. ఎప్పుడు అయితే టెంప‌ర్ సినిమాతో ఎన్టీఆర్ హిట్ కొట్టి ట్రాక్ లోకి ఎక్కాడో అక్క‌డ నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌రం లేకుండా పోయింది. టెంప‌ర్‌, నాన్న‌కు ప్రేమ‌తో, జ‌న‌తా గ్యారేజ్‌, జై ల‌వ‌కుశ‌, అర‌వింద స‌మేత వీర‌రాఘ‌వ లాంటి హిట్ల‌తో దూసుకు పోతున్నాడు.

 

అయితే ఇప్పుడు అతను అభిమానులకు ప్రేక్షకులకు ఒక షాక్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అనేది టాలీవుడ్ జనాల మాట. టాలీవుడ్ లో తారక్ సినిమా మరో రెండేళ్ళ వరకు వచ్చే అవకాశం లేదని సమాచారం. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత తారక్ త్రివిక్రమ్ తో చేసే సినిమాకు గ్యాప్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. ఈ గ్యాప్ తీసుకుని బాలీవుడ్ లో టాప్ ద‌ర్శ‌కుడు అయిన సంజ‌య్ లీలా బన్సాలి సినిమాను ఓకే చేసే అవకాశం ఉందని టాక్. బన్సాలి సినిమా భారీ ప్రాజెక్ట్ అని త్రివిక్రమ్ సినిమాను ప్రస్తుతానికి ప‌క్క‌న పెట్టేసి బ‌న్సాలీ సినిమాను పాన్ ఇండియా సినిమాగా చేస్తే బాగుంటుంద‌ని ఎన్టీఆర్ భావిస్తున్నాడ‌ట‌.

 

ఇప్పటి నుంచి కష్టపడితే అప్పటికి ఆ సినిమా పూర్తి అయ్యే అవకాశం ఉందని ఎన్టీఆర్ భావిస్తున్నాడు. ఆ సినిమాను భారీ ప్రాజెక్ట్ గా తీసుకొచ్చే సూచనలు కనపడుతున్నాయి. అందుకే ఇప్పుడు ఆ సినిమా కోసం దాదాపుగా త్రివిక్ర‌మ్‌ సినిమాను పక్కన పెట్టేసాడు తారక్ అని అంటున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆర్ఆర్ఆర్ మాత్రం వచ్చే ఏడాది జనవరికి వస్తుందంటున్నా క‌రోనా లాక్ డౌన్ నేప‌థ్యంలో అది కూడా సందేహంగానే క‌నిపిస్తోంది. ఈ లెక్క‌న ఎన్టీఆర్ సినిమా లు ఎప్పుడు వ‌స్తాయో ? అని క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూడ‌డ‌మే మిగిలి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: