బాలీవుడ్ లో హాట్ టాపిక్ అయిన జంట... రణవీర్ సింగ్ దీపిక పదుకొనే. వీరి జంట గురించి ఎన్నో చర్చలు ఎన్నో వార్తలు ముందు నుంచి కూడా వచ్చాయి. వీరి పెళ్లి కూడా ఒక సంచలనమే. రాం లీల సినిమాను కలిసి చేసిన ఈ జంట ఆ తర్వాత బాజీ రావు మస్తాని సినిమాలో కలిసి నటించారు. ఈ రెండు సినిమాలు కూడా సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వంలో వచ్చిన సినిమాలే. ఈ రెండు సినిమాల్లో కూడా వీరి నటనకు వందకు వెయ్యి మార్కులు వేసారు టాలీవుడ్ లో అయినా బాలీవుడ్ లో అయినా సరే. వీరి జంటకు దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు అనేది వాస్తవం. 

 

బన్సాలి వీరి కెరీర్ లో చాలా కీలకం అని చెప్తున్నారు. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారా లేదా అనేది చాలా మందికి సందేహంగా ఉండేది. వాస్తవానికి దీపిక విషయంలో ప్రేమ అనేది సరిగా వర్కౌట్ అవ్వలేదు. దీపిక పెళ్లి చేసుకుందాం అని ఇద్దరు ముగ్గురు హీరోలను అనుకున్నా సరే అది మాత్రం సాధ్యం కాలేదు. కాని రణవీర్ విషయంలో ఆమె చాలా జాగ్రత్తగా వ్యవహరించి వివాహం చేసుకుంది. రణవీర్ ని ఆమె చాలా గౌరవిస్తూ ఉంటుంది అని చెప్తారు. రణవీర్ కెరీర్ లో మంచి సినిమాలు వచ్చే విధంగా ఆమె అడుగులు వేసింది అని బాలీవుడ్ జనాలు కూడా వీరి జంట గురించి ప్రత్యేకంగా చెప్పుకుంటూ ఉంటారు అని అంటారు. 

 

బాలీవుడ్ లో ఇప్పుడు ఇద్దరూ కూడా కెరీర్ లో చాలా పీక్స్ లో ఉన్నారు అనేది వాస్తవం. ఇప్పుడు ఇద్దరూ కూడా సినిమాలను చాలా జాగ్రత్తగా చేయడమే కాకుండా కథల ఎంపికలో కూడా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ సినిమాలను చేస్తున్నారు. అగ్ర దర్శకులతో సినిమాలు చేసినా చిన్న దర్శకులతో సినిమాలు చేసినా సరే వీరు ఇద్దరూ ఒకటికి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: