నీది నాది ఒకే కథ ఫేమ్ వేణు ఊడుగుల డైరెక్షన్ లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఇంటెన్సివ్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న చిత్రం విరాటపర్వం. ఫిదా బ్యూటీ  సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా రానా హీరో.. ఇక ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరో షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ వుంది. లాక్ డౌన్ అయిపోయాక  ఆషెడ్యూల్ ను పూర్తి చేయనున్నారు. ఇటీవల ఈసినిమా నుండి విడుదలైన  సాయి పల్లవి ఫస్ట్ లుక్ పోస్టర్ కు  సూపర్ రెస్పాన్స్ వచ్చింది. 
 
ఈ చిత్రంలో రానా పోలీస్ ఆఫీసర్ గా నటిస్తుండగా సాయి పల్లవి నక్సలైట్ గా కనిపించనుంది. వీరితో పాటు మలయాళ నటి  నందితా దాస్, ప్రియమణి కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే ఈసినిమా టీజర్ కూడా విడుదలకానుంది. ఈ చిత్రంలో  హాలీవుడ్  స్టంట్ మాస్టర్  ఆధ్వర్యంలో తెరకెక్కిన యాక్షన్ సన్నివేశాలు  హైలెట్ కానున్నాయి. సురేష్ బాబు ప్రొడక్షన్స్, ఎస్ ఎల్ వి సినిమాస్ పథకాలపై సురేష్ బాబు , చెరుకూరి సుధాకర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు లో విడుదలయ్యే అవకాశాలు  వున్నాయి.  
 
ఇక ఈసినిమాతో పాటు సాయి పల్లవి ప్రస్తతం లవ్ స్టోరీ లోకూడా నటిస్తుంది శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాగ చైతన్య హీరోగా నటిస్తుండగాపవన్ సంగీతం అందిస్తున్నాడు. ఏషియన్ సినిమాస్ ,అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా రానా మాత్రం అరణ్య విడుదలకోసం ఎదురుచూస్తున్నాడు. కరోనా లేకుంటే ఏప్రిల్ లోనే విడుదలకావాల్సింది. జులై లో ఈసినిమా  విడుదలచేసేలా ప్లాన్ చేస్తున్నారు. విరాటపర్వం తరువాత రానా ,తేజ డైరెక్షన్ లో మరోసారి నటించనున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: