టాలీవుడ్ లో తక్కువ కాలంలో మంచి క్రేజ్ తెచ్చుకున్న హీరో శర్వానంద్‌. ఏ యువ హీరో కి అంత తక్కువ కాలంలో క్రేజ్ రాలేదు అనేది వాస్తవం. శర్వా సినిమాల విషయంలో ఒక వర్గం ప్రేక్షకులు ముందు నుంచి కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. శ‌త‌మానం భ‌వతి సినిమా అయితే ఏకంగా సంక్రాంతికి బాల‌య్య వందో సినిమా గౌత‌మీపుత్ర శాత‌క‌ర్ణి, చిరంజీవి 150వ సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 సినిమాల‌కు పోటీగా రిలీజ్ అయ్యి సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యింది. ఇది ఓ సంచ‌ల‌నం. శ‌ర్వానంద్ కు ముందు నుంచి క్లాస్ ఇమేజ్ ఎక్కువ‌. క్లాస్ లోనూ.. ఇటు యూత్‌లోనూ శ‌ర్వా సినిమాల‌కు పిచ్చ క్రేజ్ ఉంటుంది.

 

అలాంటి శర్వానంద్ ఇప్పుడు సినిమాలు చేయడానికి భయపడుతున్నాడు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. దానికి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియడం లేదు. ఇటీవల శర్వాతో సినిమా చేయడానికి గానూ ఒక దర్శకుడు వస్తే సినిమా చేయలేను అని చెప్పినట్టు తెలుస్తుంది. దీనికి కారణం ఏంటీ అనేది తెలియడం లేదు. శర్వా కు మంచి హిట్ వచ్చి దాదాపు గా మూడేళ్ళు అయింది. స‌మంత‌తో ఎన్నో ఆశ‌లు పెట్టుకుని చేసిన జాను డిజాస్ట‌ర్ అయ్యింది.

 

ఇక హిట్ లేక ఈ మూడేళ్ళు కూడా అతను చాలా ఇబ్బందులు పడ్డాడు. ఏ సినిమా చెయ్యాలో అర్ధం కాక ఇప్పుడు అవస్థలు పడుతున్నాడు. అయితే అతనికి త్రివిక్రమ్ హామీ ఇచ్చినట్టు సమాచారం. ఎన్టీఆర్ తో సినిమా లేట్ అయితే మాత్రం మంచి కథ ఉంది నీతో సినిమా చేస్తాను అని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా కథను అతనికి త్రివిక్రమ్ వినిపించే అవకాశాలు కూడా ఉన్నాయని టాలీవుడ్ లో ఇప్పుడు పెద్ద చర్చలే జరుగుతున్నాయి. త్వరలోనే స్పష్టత రానుంది. ఒక వేళ త్రివిక్ర‌మ్ శ‌ర్వాతో క‌మిట్ అయితే ఆయ‌న‌పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న నానికి పెద్ద షాకే అనుకోవాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: