ఈమధ్యనే 30 ఇయర్స్ పూర్తి చేసుకున్న జగదేకవీరుడు అతిలోక సుందరి గురించి ఓ క్రేజీ న్యూస్ చెప్పాడు నిర్మాత అశ్వనీదత్. ఈ సినిమా సీక్వల్ కూడా ఉంటుందని చెప్పి మెగా ఫ్యాన్స్ సంతోషానికి కారణమయ్యాడు. అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం నాగ్ అశ్విన్ తో అశ్వనీదత్ చేసే సినిమా జగదేకవీరుడు సీక్వల్ అనంటున్నారు. అదేంటి మెగాస్టార్ సినిమా సీక్వల్ ను యంగ్ రెబల్ స్టార్ తో ఎలా చేస్తారు అనుకోవచ్చు. మెగా ఆమోదం పొందిన తర్వాతనే ఈ ప్రాజెక్ట్ ప్రభాస్ చేతికి వచ్చిందని టాక్. 


బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ సాహోతో కూడా సత్తా చాటాడు. ఇక ప్రస్తుతం రాధాకృష్ణ డైరక్షన్ లో సినిమా సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమా ఇంటర్నేషనల్ లెవల్ లో ఉంటుందని హింట్ ఇచ్చాడు నాగ్ అశ్విన్. అయితే ఫిలిం నగర్ నుండి వస్తున్నా క్లూస్ చూస్తే ప్రభాస్ తో అశ్వనీదత్, నాగ్ అశ్విన్ చేసేది జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వల్ సినిమానే అంటున్నారు. ఈ సినిమాను భారీ రేంజ్ లో తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యారు. అందుకే భారీ బడ్జెట్ కేటాయించారట. 


మెగాస్టార్ సినిమా సీక్వల్ లో ప్రభాస్ నటిస్తే ఆ ప్రాజెక్ట్ కు వచ్చే క్రేజ్ వేరేలా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ ఫైనల్ అయ్యి సెట్స్ మీద వెళ్లెవరకూ చాలా సీక్రెట్ గా ఉంచుతారట. మరి మెగాస్టార్ సినిమా సీక్వల్ ను ప్రభాస్ నటిస్తే మెగా ఫ్యాన్స్ ఎలా రెస్పాండ్ అవుతారో చూడాలి. ఈ సినిమా కూడా అంచనాలను అందుకుంటే తెలుగు సినిమా స్టామినా మరోసారి ప్రపంచానికి తెలిస్తుందని చెప్పొచ్చు.   

మరింత సమాచారం తెలుసుకోండి: