తెలుగు సినీ పరిశ్రమలో మెగా ఫ్యామిలికి మంచి గుర్తింపు ఉంది. అందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ. అయితే పవన్ రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పటి నుండి సినీ పరిశ్రమకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే 2019 ఎన్నికల తర్వాత నుండి పవన్ మళ్ళి సినిమాలపై ఫోకస్ పెట్టారు. దీనిలో భాగంగా వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే అటు రాజకీయాల తోను, ఇటు సినిమాల తోను పవన్ ప్రజలకు చేరువవుతున్నారు. 

 

దాదాపు రెండు సంవత్సరాల కాలం తర్వాత సినిమాలపై దృష్టి పెట్టిన పవన్ పింక్ రీమేక్ సినిమా వకీల్ సాబ్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు వేణు శ్రీ రాం దర్శకత్వం వహిస్తుండగా, దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమా 80%శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ వేసవిలో విడుదల అవ్వాల్సిన ఈ సినిమా లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. అది అలా ఉంచితే పవన్ కళ్యాణ్ మరో రెండు సినిమాలకు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. క్రిష్, హరీష్ శంకర్ డైరెక్షన్స్ లో ఆ సినిమాలు ఉంటాయని సినీ వర్గాల కథనం. 

 

అయితే ఇప్పుడు తాజాగా వరంగల్ కి చెందిన యువ దర్శకుడు సంపత్ నంది పవన్ తో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నట్టు ఇండస్ట్రీలో పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. గతంలో ఒకసారి పవన్ తనతో ఒక సినిమా చేస్తానని హామీ ఇచ్చారని అందుకే దానికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా చేస్తున్నట్టు సంపత్ వెల్లడించారు. అయితే తాను గోపి చంద్ తో ఒక సినిమా చేస్తున్నాని అది పూర్తి అయ్యాక ఈ సినిమా గురించి పవన్ తో చర్చిస్తానని తెలియ చేశాడు. అయితే గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ సంపత్ డైరెక్షన్లో రావాల్సి ఉండగా కొన్ని అనివార్య కారణాల వల్ల అది బాబి డైరెక్ట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: