టాలీవుడ్ హీరోయిన్ తెలుగు వంటలు చేస్తోంది. లాక్ డౌన్ టైమ్ లో ఖాళీగా ఉండకుండా కొత్తగా  కిచెన్ లో కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది.  అతేకాదు .. షూటింగ్ డేస్  ని మిస్ అవుతున్నానని కూడా చెబుతోంది కాజల్. షూటింగ్ టైమ్ లో ఉంటే కోరిన కూరలతో ఇష్టమైన వంటలతో టైమ్ గడిచిపోయేది. కానీ ఈ లాక్ డౌన్ లో అలాంటి చాన్స్ లేదు . అందుకే అవేవో నేనే ట్రై చేస్తున్నానంటోంది కాజల్ అగర్వాల్. నార్త్ అమ్మాయి అయినా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా టాప్ స్టార్స్ అందరితో సినిమాలు చేసి నంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది.  ఇప్పుడు కూడా చిరంజీవితో ఆచార్య, కమల్ హాసన్ తో భారతీయుడు 2, శివకార్తికేయన్ తో మరో సినిమా చేస్తూ కెరీర్ లో బిజీగా ఉంది.

 

ఎప్పుడూ షూట్స్ తో బిజీగా ఉండడంతో  ఈ లాక్ డౌన్ టైమ్ లో షూటింగ్ లేక, కొత్త కొత్త ప్రయోగాలు చేస్తోంది కాజల్. అసలు ఎప్పుడూ పెద్దగా వంట గది జోలికి వెళ్లని కాజల్.. ఫస్ట్ టైమ్ సమోసా చేశానోచ్ అంటూ ఆ మద్య పోస్ట్ పెట్టింది. తరవాత కాస్త సీనియర్ అయ్యాక క్యారట్ కేక్ కూడా చేసింది. ఇప్పుడు ఏకంగా మాస్టర్ చెఫ్ అయిపోయింది. అందుకే ఆంధ్రా మీల్స్ వండేసింది. కాజల్ తన  షూటింగ్స్ ని, సెట్స్ ని బాగా మిస్సవుతోందట అందుకే .. ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటూ.. డిన్నర్ కోసం  ఆంధ్రా మీల్స్ చేశానంటోంది.

 

అదికూడా ఏదో ఒకటో రెండో ఐటమ్స్ కాదు.. బెండకాయ పులుసు, సొరకాయ పచ్చడి.. స్పెషల్లీ ఆంధ్రా ఫేమస్ పెసరట్టు వేసి  సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది కాజల్ . మిగతావాళ్లందరూ ఏదో ఒకటి చేస్తేనే మాస్టర్ చెఫ్ అని ఫీలయ్యి సోషల్ మీడియాలో ఊదరగొట్టేస్తుంటే .. కాజల్ మాత్రం కామ్ గా  ఆంధ్రా మీల్స్ రెడీ చేసింది. చేసింది ఆంధ్రా మీల్స్ అయినా టోటల్ తెలుగు వాళ్ల మనసు గెలిచేసుకుంది క్యూట్ హీరోయిన్ కాజల్.  అమ్మో అమ్మడు బతకనేర్చిన తెలివి తేటలతో తెలుగు వాళ్లని బాగానే బుట్టలో వేసుకుంటోందనుకుంటున్నారు అందరూ.

మరింత సమాచారం తెలుసుకోండి: