సూపర్ స్టార్ మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు సక్సెస్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్నాడు. సరిలేరు తర్వాత ఎవరి దర్శకత్వంలో సినిమా ఉంటుందనేది ఇంతవరకూ కన్ఫర్మ్ కాలేదు. వంశీ పైడిపల్లితో క్యాన్సిల్ అయ్యాక గీత గోవిందం పరశురామ్ తో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. పరశురామ్ మహేష్ కోసం స్క్రిప్టు కూడా రెడీ చేశాడట. పరశురామ్ కూడా తన తర్వాతి చిత్రం మహేష్ తో ఉంటుందని కన్ఫర్మ్ చేశాడు.

 

ఒకానొక ఇంటర్వ్యూలో పరశురామ్ మాట్లాడుతూ, ఒక్కడు సినిమా ఇన్స్పిరేషన్ తోనే సినిమా ఇండస్ట్రీలోకి వచ్చానని.. ఇప్పుడు అదే సినిమా హీరోతో సినిమా అవకాశం అదృష్టమని చెప్పాడు. అంతే కాదు ఇప్పటి వరకూ క్లాస్ సినిమాలు తీసిన తాను మహేష్ ని మాస్ జనాలకి నచ్చే విధంగా ఫైట్లు, ఎలివేషన్ సీన్లతో చూపిస్తానని మాటిచ్చాడు కూడా. అయితే ఈ విషయమై మహేష్ స్పందించకపోవడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది.

 

పరశురామ్ కన్ఫర్మ్ చేశాడు. కానీ మహేష్ కన్ఫర్మ్ చేయలేదు. కాబట్టి వీరిద్దరి కాంబినేషన్లో సినిమా ఉంటుందా లేదా అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే ఈ సందేహాలన్నీ తీరే రోజు దగ్గరలోనే ఉంది. ఈ నెల ౩౧వ తేదీ సూపర్ స్టార్ క్రిష్ణగారి జన్మదినం. కావున ఆ ప్రత్యేకమైన రోజున మహేష్ ప్రాజెక్టు గురించి అప్డేట్ వస్తుందని భావిస్తున్నారు. గతంలోనూ అదే రోజున మహేష్ తన సినిమాల ప్రకటనలు చేశాడు.

 

కాబట్టి మే౩౧వ తేదీ ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్ నుండి తన తర్వాతి చిత్రం ఎవరి దర్శకత్వంలో ఉంటుందనేది వెల్లడి చేస్తాడని నమ్ముతున్నారు. మరి అభిమానులు కోరుకుంటున్నట్టు మహేష్ అప్డేట్ ఇస్తాడా లేదా చూడాలి. ఇదే గాక రాజమౌళితో మహేష్ సినిమా గురించి ప్రకటన వెలువడే అవకాశం ఉంది. దీనికోసం అభిమానుల ఎదురుచూపులు ఆల్రెడీ మొదలయ్యాయి. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: