బుల్లితెరపై వచ్చిన రామయణం, మహాభారత్ సీరియల్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా అవి పునః ప్రసారం అవుతున్నాయి.  ఒకప్పుడు సీరియల్స్ అంటే ఇవే అన్నంతగా ట్రెండ్ అయ్యాయి.  ఇప్పుడు కూడా దూరదర్శన్ రేటింగ్ అమాంతం పెరిగేలా చేస్తున్నాయి. వినోద ప్రధాన చానళ్లు పెద్దగా లేని రోజుల్లో దూరదర్శన్ లో ప్రసారమైన మహాభారత్ అత్యంత ప్రజాదరణ పొందింది. ఇటీవల లాక్ డౌన్ సందర్భంగా రీ టెలికాస్ట్ చేసినా కూడా రేటింగ్స్ అదిరిపోయాయి. తాజాగా మహాభారత్ లో ద్రౌపతి పాత్రలో నటించిన రూపా గంగూల్ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లారు. మహాభారత్ లో  వస్త్రాపహరణం సన్నివేశాల్లో ద్రౌపది నిస్సహాయతను ఆమె అద్భుతంగా పలికించింది.

 

 

అయితే, తనకు నిజజీవితంలోనూ వస్త్రాపహరణం తరహా ఘటన ఎదురైందని రూపా వెల్లడించారు.  ఆమె రాజకీయాల్లోకి వచ్చే ముందు ఎన్నో ఇబ్బందులు ఎదర్కొన్నారట. రూపా గంగూలీ ప్రస్తుతం బీజేపీ రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారు. అయితే, తాను రాజకీయాల్లో ప్రవేశించిన సమయంలో 2016లో మరో వర్గం వ్యక్తులు తనపై దాడి చేశారని వివరించారు.  కోల్ కతా లోని డైమండ్ హార్బర్ వద్ద తనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారని, తనను నేలకేసి విసిరికొట్టారని, చీర లాగేశారని వెల్లడించారు.

 

 

తన తలను కారుకేసి కొట్టారని, దాంతో ఓ కన్ను పోయినంత పనైందని వివరించారు. ఎలాగో అలా కార్ డ్రైవ్ చేసుకుంటూ ఎన్నో ఇబ్బందులు పడుతూ బయట పడ్డానని అన్నారు.  ఆ గాయాలతో ఆసుపత్రికి వెళ్లానని, కళ్లు సరిగా కనిపించకపోవడంతో కార్లో ఉన్న మహిళా కార్యకర్తలు సూచనలు ఇస్తుంటే కారు నడిపానని ఆ చేదు ఘటనను గుర్తు చేసుకున్నారు. ఒకప్పుడు టివి సీరియల్ లో ఆమెను చూస్తే అందరూ ఎంతో గౌరవించేవారని కానీ రాజకీయాల్లోకి వచ్చాక ఇబ్బందులు తప్పలేదని ఆమె అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: