టాలీవుడ్ లో ఇప్పుడు హీరోలు చాలా మంది వ్యాపారాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. చిన్న హీరోలు అయినా పెద్ద హీరోలు అయినా సరే వ్యాపారాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు అనే ప్రచారం ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతుంది. ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్ ఈ విధంగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే అతను వ్యాపారంలో తాను ఏంటీ అనేది చూపించాడు. ఇప్పుడు అతని దృష్టి మరో రంగం మీద పడింది అని టాలీవుడ్ లో ప్రచారం ఎక్కువగానే జరుగుతుంది. ఆ రంగం ఏంటీ అనేది త్వరలోనే స్పష్టత వస్తుంది. 

 

అయితే ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం చూస్తే అతను ఇప్పుడు వ్యవసాయం మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. భార్య ఉపాసానా ద్వారా అతను భూమి కొని వ్యవసాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నాడు అని వార్తలు వినపడుతున్నాయి. ఆమె ఇటీవల తన తండ్రి సొంత ఊరు వెళ్ళింది. అక్కడ వ్యవసాయం పశువుల పెంపకం వంటి వాటిని పరిశీలించింది. వాటి తో కలిసి ఫోటోలు కూడా ఆమె తీసుకున్నారు. ఈ ఫోటోలను ఆమె సోషల్ మీడియా లో పోస్ట్ కూడా చేసారు. ఇప్పుడు ఆమె వ్యాపారం అదే అని అంటున్నారు. 

 

రామ్ చరణ్ ఇప్పుడు పశువుల పెంపకం మీద ఫోకస్ చేసే అవకాశం ఉందని అందుకే భార్యను పంపించారు అని అంటున్నారు. ఆమె ఇప్పుడు దీని మీద పూర్తి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు అని అంటున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఇది వచ్చే ఏడాది వేసవి నాటి నుంచి మొదలు అయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం. మరి చేస్తారా లేదా అనేది చూడాలి. రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: