టాలీవుడ్ లో చాలా మంది యువ హీరోలు ఇప్పుడు కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది యువ హీరోలకు నిన్న మొన్నటి వరకు వరుసగా ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చాయి. భారీ రెమ్యున రేషన్లు కూడా నిర్మాతలు ఆఫర్ చేశారు. స్టార్ దర్శకులు కూడా యువ, మీడియం రేంజ్ హీరోల వెంట పడ్డారు. అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది. నిన్న మొన్నటి వరకు తమ వెనకాల పడిన దర్శక నిర్మాతలు ఇప్పుడు సినిమా అంటే ఇప్పుడు కాదు భవిష్యత్తులో ఎప్పుడైనా చూద్దాంలే అని తప్పించు కుంటున్నారట.
ఇదిలా ఉంటే ఇప్పుడు సినిమాలు విడుదల అయినా సరే తమ సినిమాల భవిష్యత్తు ఏంటీ అనే ఆందోళన చాలా మందిలో ఉంది. సినిమాలు విడుదల అయిన తర్వాత తమ సినిమాలకు జనాలు వస్తారా లేదా అనేది కూడా చాలా మందికి ఇప్పుడు అర్ధం కావడం లేదు. దీనితో కొంత మంది హీరోలు ఒక ప్లాన్ చేస్తున్నారట. హీరోలు గా తమకు అంత స్టార్ ఇమేజ్ లేకపోతే సినిమాల మీద ఆధారపడకుండా వెబ్ సీరీస్ లను కూడా తీసుకుని వచ్చే ఆలోచనలో ఉన్నారు అని సమాచారం.
అదే విధంగా తాము సంపాదించిన సొమ్ముతో వ్యాపారాలు కూడా చేసుకునే విధంగా ప్లాన్ కూడా చేసుకుంటున్నారు అని తెలుస్తుంది. దీని మీద త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. శర్వానంద్ అయితే సినిమాల మీద ఆశలు వదిలేశాడు అని అంటున్నారు. అదే విధంగా ఒకరు ఇద్దరు స్టార్ హీరోలు కూడా ఇదే విధంగా ఆలోచన చేస్తున్నారని అంటున్నారు. దీని వెనుక వాస్తవం ఎంత ఉంది అనేది పక్కన పెడితే చాలా మంది మాత్రం సినిమాల నుంచి తప్పుకోవడమే మంచిది అని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. హీరోయిన్ లు కూడా ఇప్పుడు మరింత ఇబ్బంది పడుతున్నారు అని కూడా వార్తలు ఎక్కువగా వస్తున్నాయి.