ఒకప్పుడు ఆ హీరోయిన్స్ ఓ వెలుగు వెలిగారు. తమ నటనతో అప్పటి ప్రేక్షకులను థియేటర్ల వైపు తిప్పుకున్నారు. చక్కటి కట్టుబొట్టుతో మైమరిపించే హావభావాలతో అలరించారు. 80వ దశకంలో కనిపించిన వాళ్లు మళ్లీ థియేటర్లపై మెరవబోతున్నారు. 

 

సాధారణంగా 50ఏళ్లు పైబడిన నటీమణులు.. హీరోయన్స్ గా నటించడానికి ఆసక్తి చూపరు. ఒక వేళ హీరోయిన్ గా కనిపించాలనుకున్నా డైరెక్టర్స్ యాక్సెప్ట్ చేయరు. కానీ 80వ దశకంలో అగ్ర కథానాయికలుగా ఓ వెలుగు వెలిగిన 50ఏళ్లు పై బడిన హీరోయిన్స్ నలుగు మళ్లీ కథానాయికలుగా కనిపిస్తున్నారు. వీళ్లందరూ ఒకే సినిమాలో నటించడం విశేషం. 

 

సుహాసినీ.. రాధిక.. ఊర్వశి.. ఖుష్బూ. వీళ్లందరిలో సుహాసినీ పెద్దది. సుహాసినీ వయసు 58అయితే.. రాధికకు 56ఏళ్లు. వీళ్లందరూ ప్రస్తుతం నటిస్తున్నా.. అమ్మ.. అత్తగా సహాయక నటి పాత్రలు మాత్రమే పోషిస్తున్నారు. రీ ఎంట్రీలో రాని హీరోయిన్ ఛాన్స్ వాళ్లకు ఇప్పుడొచ్చింది.

 

ఓ అంద నాట్కళ్ సిినిమాలో సుహాసినీ, రాధిక, ఊర్వశి, ఖుష్బూ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ జేమ్స్ వసంతన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో వైజీ మహేంద్రన్, సుందర్.సి తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. 80శాతం చిత్రాన్ని ఆస్ట్రేలియాలో చిత్రీకరించారు. సినిమా నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. 

 

ఓ అందనాట్కళ్ లోని మద్రాస్ ఎన్న మెల్ బోర్న్ ఎన్న అంటూ సాగే లిరికల్ వీడియో చూస్తుంటే.. ఎంటర్ టైన్ మెంట్ గా రూపొందింది అనిపిస్తోంది. నవ్వించే బాధ్యతను ఊర్వశికి అప్పజెబుతున్నాడు. 1980లో వచ్చిన నాలుగు హిట్ చిత్రాల్లో నటించిన రాధిక, ఖుష్బూ, ఊర్వశి, సుహాసినీ పాత్రలు కొనసాగింపుతో ఈ సినిమాను రూపొందించామన్నారు దర్శకుడు. అయితే.. ఆ సినిమాలు ఏమిటో చెప్పలేదు.

 

థియేటర్స్ ఎప్పుడు తెరుస్తారా..ఎప్పుడెప్పుడు హీరోయిన్స్ గా కనిపిద్దామా అని ఈ నలుగురు హీరోయిన్స్ ఎదురు చూస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: