టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, రోజా గురించి అనేక చర్చలు జరుగుతూ ఉంటాయి. వీరి కాంబినేషన్ లో హీరో హీరోయిన్ లు గా ఎన్నో సినిమాలు వచ్చాయి అప్పట్లో ఆ సినిమాలు అన్నీ కూడా దాదాపుగా విజయం సాధించాయి కూడా. భైర‌వ‌ద్వీపం లాంటి సినిమాలో రోజా - బాల‌య్య కాంబినేష‌న్ న‌ట‌న‌కు అప్ప‌ట్లో తెలుగు ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌రథం ప‌ట్టారు. ఇక బొబ్బిలి సింహం సినిమాలో అయితే బాల‌య్య వ‌ర్సెస్ రోజా న‌ట‌న కు ఫిదా కాని తెలుగు ప్రేక్ష‌కుడు ఉండ‌డు. 

 

ఇక ఇప్పుడు వీరు ఇద్దరూ కలిసి నటించే అవకాశం ఉందనే ప్రచారం కూడా మనం ఎక్కువగా వింటూనే ఉన్నాం. వాస్తవం ఉన్నా లేకపోయినా సరే ఈ వార్తలు మాత్రం వస్తున్నాయి. ఇటీవల ఒక కీలక పాత్రకు గానూ బాలకృష్ణ స్వయంగా ఆమెను తన సినిమాలో చేయమని అడిగినట్టు సమాచారం. దీనికి రోజా నో అని చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. దీని వెనుక వాస్తవం ఎంత ఉంది అనేది పక్కన పెడితే ఆమె బాలకృష్ణ భార్యగా క‌నిపిస్తుంద‌ట‌. అయితే సినిమాలో ఆమె బాల‌య్య ప‌క్క‌న క‌నిపించ‌ద‌ని స‌మాచారం. దీనిని బ‌ట్టి ఇది ఏదో ప్లాష్ బ్యాక్‌లో క‌థ అయి ఉండ‌వ‌చ్చ‌ని అంచ‌నా.

 

అయితే ఇది బోయ‌పాటి శీను సినిమానా లేదా మ‌రో సినిమానా ? అన్న‌ది క్లారిటీ లేదు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ చేసే సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. లాక్ డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ ని వాయిదా వేసింది చిత్ర యూనిట్. లాక్ డౌన్ పూర్తి అయిన తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమా తర్వాత బాలయ్య చేసే సినిమా ఏంటీ అనేది ఇంకా స్పష్టత రావడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: