కోలీవుడ్ తో పాటు మన టాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ ఉన్న తమిళ్ హీరోలలో స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. రెండు ఇండస్ట్రీలలో సూర్య మోస్ట్ లవబుల్ హీరోగా మారడానికి కారణం కేవలం తన సినిమాలు మాత్రమే కాకుండా ఆయన వ్యక్తిత్వం కూడా అని చెప్పాలి. సౌత్ ఇండియన్ స్టార్ హీరోగా సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే చాలా సినిమాలను లైన్లో పెట్టాడట. ప్రస్తుతం ఆకాశమే నీ హద్దురా అంటూ సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని తెలుగు, తమిళ భాషలలో ఒకేసారి విడుదల చేయనున్నారు. ఇదేకాకుండా తనకి బాగా కలిసొచ్చిన సింగం సినిమాకి సీక్వెల్ చేసే పనిలో ఉన్నాడట సూర్య.. దీనికి హరి దర్శకత్వం వహించనున్నారు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయ్యిందట. ఇక తాజాగా కార్తీ హీరోగా ఖైదీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఖైదీ ఎంతటి విజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకి లోకేష్ కనగరాజ్‌ దర్శకత్వం వహించారు. ఇప్పుడ లోకేష్ సూర్యకి కూడా ఓ లైన్ ని వినిపించారట. ఆ లైన్ సూర్యకి బాగా నచ్చడంతో పూర్తి కథని సిద్దం చేయాలనీ కోరారట. అన్ని అనుకున్నట్టుగా కుదిరితే ఈ సినిమా వచ్చే ఏడాది పట్టాలేక్కే ఛాన్స్ ఉంది.

 

అయితే సూర్య ఇప్పుడు తాను నటించిన ఓ ఇంట్రెస్టింగ్ సినిమాకి సీక్వెల్ తీయబోయే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. గతేడాది సూర్య మరియు మోహన్ లాల్ ల కాంబోలో కె వి ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం 'బందోబస్త్'. ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబడిన ఈ చిత్రం మిక్సిడ్ రెస్పాన్స్ ను అందుకుంది. కె వి ఆనంద్ - సూర్య కాంబినేషన్ లో ఇప్పటి వరకు మూడు సినిమాలు వచ్చాయి. సూర్య హీరోగా తమన్నా హీరోయిన్ గా నటించిన థ్రిల్లర్ చిత్రం “వీడోక్కడే” తమిళ్ లో “అయాన్” గా తీసిన ఈ చిత్రం రెండు భాషల్లోనూ సూపర్ హిట్ అయ్యింది. అలానే సూర్య - కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్స్ గా 'బ్రదర్స్' అనే సినిమాని తెరకెక్కించాడు. అయితే ఇప్పుడు వినిపిస్తున్న బజ్ ప్రకారం 'వీడోక్కడే' చిత్రానికి సీక్వెల్ ఈ కాంబో రెడీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి స్క్రిప్ట్ వర్క్ లో ఉన్న ఈ చిత్రం ఈ కరోనా ప్రభావం తగ్గిన తర్వాత ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: