జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా రిలీ అయ్యి రీసెంట్ గా 30 ఏళ్లు కంప్లీట్ అయ్యింది. ఈ సినమాకు సంబందించి ఉంగరం మింగిన చేప ఏమయ్యింది..? అసలు ఆ ఉంగరంఏది అంటూ సీక్వెల్ కి సంబందించి హింట్ ఇచ్చారు ప్రొడ్యూసర్ అశ్వినీ దత్ . వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వీనీదత్ అల్లుడు నాగాశ్విన్ ప్రబాస్ తో తెరకెక్కించబోతున్న సినిమా కూడా ఫిక్షన్ మూవీ అని చెప్పాడు నాగి. అయితే ఆ ఫిక్షన్ మూవీ జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి సీక్వెలే అని,జగదేకవీరుడి వారసుడు ప్రభాస్ అని టాలీవుడ్ రూమర్ నడుస్తోంది.
మహేష్ బాబు ఈ మద్య మరీ సోషల్ మెసేజ్ మూవీసే చేస్తున్నాడని.. ఈ సారి లవ్ స్టోరీ పిక్ చేసుకున్నాడట. పరశురామ్ డైరెక్షన్లో మహేష్ బాబు చెయ్యబోయే సినిమాలో మహేష్ కాలేజ్ బాయ్ లా కనిపించబోతున్నాడట. అందుకే అదే లుక్ తో పాటు ఇంకాస్త్ స్లిమ్ అవుతున్నాడట సూపర్ స్టార్ . మహేష్.. మహర్షి సినిమాలో కాలేజ్ బాయ్ లా కనిపించి సర్ ప్రైజ్ చేశాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. ఇప్పటి వరకూ తెలుగు సినిమాల మీదే కాన్సన్ ట్రేట్ చేశఆడుకానీ .. టాలవుడ్ దాటి బయటకెళ్లలేదు. అలాంటిది ఇప్పుడు ప్యాన్ ఇండి యా సినిమా చెయ్యబోతున్నాడు . ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చెయ్యబోయే సినిమా ప్యాన్ ఇండియా వైడ్ గా తెరకెక్కబోతోందని టాలీవుడ్ లో రూమర్ నడుస్తోంది.
బాలక్రుష్న , బోయపాటి సినిమాలో రోజుకో రూమర్ బయటికొస్తోంది. మొన్నమొన్నటి వరకూ బాలయ్య తో ఆచర్య శ్రీనివాస ఆత్రేయలో నటించిన నవీన్ కనిపించబోతున్నడని న్యూస్ వినిపిస్తే.. ఇప్పుడు స్వయం వరం హీరో వేణు.. బాలక్రుష్న సినిమాలో ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్నట్టు రూమర్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తకు సంబందించి ఇప్పటి వరకూ కన్ ఫర్మేషన్ మాత్రం లేదు. ఇలా టాలీవుడ్ లో స్టార్ హీరోల దగ్గరనుంచి ప్రతి సినిమాకూ రకరకాల ఇంట్రస్టింగ్ రూమర్స్ రన్ అవుతున్నాయి.