లాక్ డౌన్ కారణంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంటికే పరిమితమయ్యాడు. మాములుగా సినిమా షూటింగ్ లతో బిజీగా ఉండే మహేష్ గ్యాప్ వస్తే ఎక్కువగా కుటుంబంతోనే గడుపుతుంటారు. ఇప్పుడు షూటింగ్ లు లేకపోవటంతో మొత్తం సమయాన్ని కుటుంబ సభ్యులకే కేటాయించాడు మహేష్. సితార, గౌతమ్‌ లతో కలిసి ఆడుకుంటున్నాడు. ఆ ముగ్గురు కలిసి చేసే అల్లరిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఫ్యాన్స్‌ కు కిక్కిస్తుంది నమత్ర. ఈ లాక్ డౌన్ సమయంలో రోజుకో వీడియో ఫోటోలను షేర్ చేస్తూ .. మహేష్ బాబు, సితార, గౌతమ్‌ల గురించి ఫ్యాన్స్‌ కు తెలిసేలా చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యామిలీకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడో మనందరికి తెలిసిందే. సమయం దొరికినప్పుడల్లా వారిని ఔటింగులకు తీసుకెళ్తూ ఎంజాయ్ చేస్తుంటాడు. ముఖ్యంగా తన పిల్లలు గౌతమ్ కృష్ణ - సితార లతో కలిసి మహేష్ చిన్నపిల్లాడిగా మారిపోయి అల్లరి చేస్తుంటాడు. ఈ మధ్య సితార కోసం సింగర్ గా మారి నవ్వించేసాడు. డైలీ ఫోటో లేదా వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మహేష్ తన పిల్లలతో కలిసి ఉన్న పిక్ బయటకి వచ్చింది. 

 

ఈ ఫోటో చూసిన ఎవరైనా షాక్ అవ్వక మానరు. లాక్ డౌన్ లో మరీ ఇంతగా మారిపోయాడు. మహేష్ వయసు సగానికి సగం తగ్గిపోయింది. జస్ట్ 20 ప్లస్ అంతే అన్నట్టుగా కనిపిస్తున్నాడు. హీరోగా అడుగుపెట్టిన రాజకుమారుడు సినిమాలో ఎలా ఉండేవాడో అలా ఉన్నాడు. మరీ ఇంతగా యూత్ అయిపోయాడు. ఈయనకి ఏజ్ అనేది నెంబర్ మాత్రమే అని నిరూపిస్తున్నాడు. కళ్లజోడు ధరించి కొడుకు గౌతమ్ కూతురు సితార పాప లతో సెల్ఫీ దిగాడు మహేష్. ఈ ఫోటోను సతీమణి నమ్రత ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఈ ఫోటో చూసిన ఎవరైనా గౌతమ్ కి అన్న ఉన్నాడా అనే డౌట్ వ్యక్తం చేయకకుండా ఉండలేరు. అంత కుర్రాడిలా కనిపిస్తున్నాడు మహేష్. ఈ ఫొటోస్ చూసిన అభిమానులు అవాక్కవుతున్నారు. మహేష్ తన కెరీర్లో 27వ చిత్రాన్ని పరశురామ్ దర్శకత్వంలో చేయనున్నాడు. ఈ లుక్ ఆ సినిమా లోనిదా అనే అనుమానం కూడా కలుగుతోంది. 

 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 

My clan is retiring for the night ❤️❤️good nite people 🌟🌟#lockdownlife #staysafe

A post shared by namrata Shirodkar (@namratashirodkar) on

మరింత సమాచారం తెలుసుకోండి: