తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న రానా బాహుబలి సినిమా ద్వారా ఇండియా వైడ్ గా పేరు పొందాడు. రాజమౌళి రూపొందించిన ఈ మాస్టర్ పీస్ ద్వారా రానా పేరు మారుమోగిపోయింది. ప్రభాస్ కి సరైన విలన్ గా భళ్ళాలదేవ పాత్రలో రానా ప్రదర్శించిన విలనిజానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అయితే మరోమారు రానా ప్రభాస్ విలన్ గా కనిపించనున్నాడని వార్తలు వస్తున్నాయి.

 

రాధాక్రిష్ణ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా పూర్తికాగానే మహానటి నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా సినిమా స్టార్ట్ కానుంది. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందే ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ జోనర్ లో ఆద్యంతం కొత్తగా ఉండనుందట. టైమ్ ట్రావెలర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విలన్ గా రానా చేస్తున్నాడన్న పుకార్లు షికర్లు చేస్తున్నాయి. అయితే ఈ పుకార్లు రావడానికి ఓ కారణముంది.

 

మొన్నటికి మొన్న రానా సొషల్ మీడియాలో వర్క్ చేస్తున్న ఫోటో షేర్ చేశాడు. ఆ ఫోటోని నాగ్ అశ్విన్ తీశాడని పేర్కొన్నాడు కూడా.  దాంతో ఒక్కసారిగా ఈ పుకార్లు చెలరేగాయి. అంతే కాకుండా, నాగ్ అశ్విన్ నిర్మాత సురేష్ బాబుతో చర్చిస్తూ సినిమా థియేటర్లకి జనాలని రప్పించాలంటే ఎలా అనే అంశంపై డిస్కస్ చేశానంటూ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నాడు. దాంతో సురేష్ బాబుని కలవడానికి కారణం ప్రభాస్ సినిమా కథ వినిపించడానికె అయ్యుంటుందని అంచనాకి వచ్చేశారు.

 

అందుకే మరోమారు రానా దగ్గుబాటి ప్రభాస్ కి విలన్ గా నటించబోతున్నాడని పుకార్లు సృష్టించారు. అయితే చాలా సార్లు చాలా పుకార్లు నిజమవుతుంటాయి. అయితే కొన్ని పుకార్లు ఇటు ఆడియన్స్ కీ, అటు సెలెబ్రిటీలకి ఇబ్బందిని గురి చేస్తుంటాయి. కానీ ప్రస్తుతం చక్కర్లు కొడుతున్న ఈ పుకారు నిజమవుతే బావుంటుందని చాలా మంది అభిమానులు కోరుకుంటున్నారు. బాహుబలి తర్వాత మళ్ళీ వారిద్దరినీ ఒకే తెరపై చూడాలని ఎంతగానో ముచ్చటపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: