మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం యాక్షన్ హీరో గోపీచంద్ సరసన 'సీటీమార్' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'శ్రీ' సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన తమన్నా 'హ్యాపీడేస్' సినిమాతో అమాంతం క్రేజ్ పెంచేసుకుంది. దాదాపు టాలీవుడ్ లో అందరు హీరోలతో అమ్మడు స్క్రీన్ షేర్ చేసుకుంది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించి ఎంతో క్రేజ్ సంపాదించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ బ్యూటీ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమై దశాబ్ద కాలం గడిచిపోతుంది. అయినా అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. సినీ కెరీర్ స్టార్ట్ చేసిన ఇన్నేళ్లలో తమన్నా ఒక్క ఏడాది కూడా గ్యాప్ ఇవ్వలేదు అంటేనే తెలుస్తోంది ఈ ముద్దుగుమ్మకి ఉన్న క్రేజ్. గత ఏడాది 7 సినిమాల్లో నటించిన తమన్నా ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన 'సరిలేరు నీకెవ్వరూ' సినిమాలో మహేష్ బాబు పక్కన డాంగ్ డాంగ్ అనే పాటలో చిందులేసింది. టాలీవుడ్ మిల్కీ బ్యూటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న తమన్నా భాటియా జయాపయాలతో సంబంధం లేకుండా వరుస అవకాశాలతో దూసుకుపోతోంది.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ నడుస్తుండటంతో సెలబ్రెటీలందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఇంట్లో చేసే వంటల వీడియోలను.. హోమ్ వర్క్ ఔట్ వీడియోలను..టిక్ టాక్ వీడియోలను.. డ్యాన్స్ వీడియోలను.. ఫోటోలను సోషల్ మీడియా పోస్ట్ చేస్తూ అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. చిన్నప్పటి నుండి నేర్చుకోవాలని సమయం దొరక్క వదిలేసిన వాటిని ఇప్పుడు ఈ కరోనా హాలిడేస్ లో నేర్చుకోడానికి ట్రై చేస్తున్నారు. మన మిల్కీ బ్యూటీ తమన్నా కూడా అదే చేస్తోంది. ఇంతకముందు తన మదర్ టంగ్ సింధీని తన మదర్ నుండి నేర్చుకుంటున్నానంటూ వెల్లడించింది. ఇప్పుడు తాజాగా ఒక ఇంటర్వ్యూలో మిల్కీ బ్యూటీ మరో విషయాన్ని బయటపెట్టింది. లాక్ డౌన్ లో తన తల్లి నుండి సింధీ రుచికరమైన వంటలను ఎలా వండాలో కూడా నేర్చుకుంటోందట తమన్నా. గత దశాబ్ద కాలంగా సినిమాలతో బిజీగా గడుపుతున్న మిల్కీ బ్యూటీకి తన మాతృబాష మరియు సింధీ వంటలు నేర్చునే టైం దొరకలేదంట. సో ఇప్పుడు దొరికిన ఈ సమయాన్ని వాటిని నేర్చుకోడానికి యూస్ చేసుకుంటోంది తమన్నా. 

మరింత సమాచారం తెలుసుకోండి: