పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ఇప్పుడు వరుసగా సినిమాలు మొదలు పెట్టారు. ప్రస్తుతం బాలీవుడ్ మూవీ పింకర్ రిమేక్ గా తెలుగు లో వకీల్ సాహెబ్ మూవీ తీస్తున్నారు. ఈ మూవీ తర్వాత క్రిష్ దర్శకత్వంలో మరో మూవీ, తర్వాత హరీష్ శంకర్ ఇలాం వరుస పెట్టి ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తర్వాత త్రివిక్రమ్ తో మరో మూవీ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా పవన్ కల్యాణ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ ఒక సినిమాను రూపొందిస్తున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పనులతో ఆయన బిజీగా వున్నాడు. పవర్స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న మూవీలో మానస హీరోయిన్ అని వార్త రావడంతో ఈమె పేరు టాలీవుడ్లో మార్మోగిపోయింది. పవన్ అభిమానులందరూ ఈ అమ్మాయి గురించి గూగుల్లో అన్వేషణ ప్రారంభించారు. మలయాళ చిత్రపరిశ్రమకి బాలనటిగా పరిచయమైన ఈ అమ్మాయి, టీనేజ్ లోకి అడుగుపెట్టిన తరువాత అక్కడ 10 సినిమాల వరకూ చేసింది.
ఈ అమ్మాయి పవన్ సినిమాతో తెలుగు తెరకి హీరోయిన్ పరిచయం కానున్నట్టు ప్రచారం జరిగింది. ఇదంతా కేవలం పుకారు మాత్రమేనని హరీశ్ శంకర్ స్పష్టం చేశాడు. అయితే ఈ లోగానే మానస రాధాకృష్ణన్ గురించి యూత్ సెర్చ్ చేసేసింది. కొంతమంది దర్శక నిర్మాతలు కూడా ఆ అమ్మాయిని గురించి తెలుసుకున్నారు. టాలీవుడ్ యంగ్ హీరోలకు ఈమె మంచి ఛాయిస్ అని అనుకుంటున్నారట.
ఏదేమైనా ఒక్క రూమార్ మానసకు ఎనలేని గుర్తింపు తీసుకొచ్చింది. అలా ఈ అమ్మాయికి వరుస అవకాశాలు వెళుతున్నాయని అంటున్నారు. పుకారు తెచ్చిపెట్టిన అదృష్టం ఈ సుందరిని ఇక్కడ బిజీ చేస్తుందేమో చూడాలి. ఏది ఏమైనా ఈ మాలీవుడ్ బ్యూటీకి పవన్ తో సినిమా అనగానే ఒకర్కసారే అనూహ్యమైన క్రేజ్ వచ్చిపడిందని అంటుననారు. మరి తెలుగు లో భవిష్యత్ లో ఏదైనా ఛాన్స్ ఉండొచ్చని అంటున్నారు.