యంగ్ హీరో నాగ శౌర్య నటించిన ఛలో సినిమా తో టాలీవుడ్ కి హీరోయిన్ గా పరిచయమయింది కన్నడ బ్యూటి రష్మిక మందన. మొదటి సినిమాతోనే టాలీవుడ్ మేకర్స్ ని, హీరోలని బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత విజయ్ దేవరకొండ తో డియర్ కామ్రేడ్, గీత గోవిందం, సూపర్ స్టార్ మహేష్ బాబు తో సరిలేరు నీకెవ్వరూ...నితిన్ తో భీష్మ సినిమాలతో వరుసగా సూపర్ హిట్స్ ని అందుకుంది. వీటిలో ఒక్క డియర్ కామ్రేడ్ మాత్రమే ఫ్లాప్ గా మిగిలింది. దాంతో టాలీవుడ్ లో రష్మిక లక్కీ హీరోయిన్ అయిపోయింది.

 

ఇక ఈ సంవత్సరం సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలతో భారీ సక్సస్ లను అందుకున్నప్పటి నుంచి రష్మిక కి తెలుగులో డిమాండ్ బాగా పెరిగింది. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారడమే కాదు పూజా హెగ్డే తో పోటీ పడుతూ రేస్ లో దూసుకుపోతుంది. తెలుగు, తమిళంలో క్రేజీ ప్రాజెక్ట్స్ ని దక్కించుకుంది. అయితే తాజాగా వినిపిస్తున్న టాక్ ప్రకారం రష్మిక కి కరోనా కారణంగా ఊహించని షాక్ తగిలిందని అంటున్నారు. ప్రస్తుతం లక్కీ హీరోయిన్ గా క్రేజ్ తో ఉన్న ఈ కన్నడ బ్యూటీ తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ మీద ఎన్నో ఆశలు పెట్టుకుందట. సరిలేరు నీకెవ్వరు, భీష్మ సక్సస్ ల మాదిరిగానే మరిన్ని హిట్స్ కొట్టి 2020 లో నంబర్ వన్ ప్లేస్ సాధించుకోవాలనుకుందట.

 

అయితే కరోనా వేసిన కాటుకి రష్మిక ప్లాన్స్ ని తారుమారు అయ్యాయని తెలుస్తుంది. ఇప్పుడు రష్మిక రెండు భారీ సినిమాలకు సంతకాలు చేసింది. అందులో ఒకటి అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న క్రేజీ ప్రాజెక్టు పుష్ప. ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా 5 భాషల్లో రిలీజవుతోంది. వాటిలో తన మాతృ భాష కన్నడ కూడా ఉంది. ఇక మరొక సినిమా కార్తీ సరసన తమిళంలో చేస్తుంది.

 

అయితే ఈ రెండు సినిమాలు గనక సక్సస్ అయితే భారీగా రెమ్యూనరేషన్ పెరుగుతుందని భావించిందట. కాని ఇప్పుడు నెలకొన్న నేపథ్యంలో నిర్మాతలు హీరో, హీరోయిన్స్ అందరికి రెమ్యూనరేషన్ బాగా తగ్గిస్తున్నారని అంటున్నారు. దీంతో రష్మిక 2020 లో అనుకున్న నంబర్ ప్లేస్ అలాగే పెరుగుతుందనుకున్న రెమ్యూనరేషన్ విషయంలో ప్లాన్స్ తారుమారయ్యాయని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: