డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తనయుడు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి తీసిన చిత్రం మెహబూబా. రెండేళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రం డిజాస్టర్ ఫలితాన్ని రాబట్టింది అయితే ఆకాష్ నటన కు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఇక ఇప్పుడు నిర్మాత గా మారి ఆకాష్ హీరోగా పూరి నిర్మిస్తున్న చిత్రం రొమాంటిక్. ఈసినిమా కు ఛార్మి కూడా ఓ నిర్మాత గా వ్యవహరిస్తుంది. తాజాగా ఆమె ఈసినిమా గురించి స్పందించింది. రొమాంటిక్ విజయం పై నమ్మకం ఉందని ఈ సినిమా తరువాత అందరు ,ఆకాష్ ను సీరియస్ గా తీసుకుంటారు. ముఖ్యంగా క్లైమ్యాక్స్ లో అతని నటన సూపర్ అని ఛార్మి తెలిపింది.
నిజానికి ఈ
సినిమా ఎప్పుడో పూర్తి కావాల్సింది కానీ రీ షూట్ లు చేయడంతో
సినిమా ఆలస్యంగా పూర్తి కానుంది. మొదట ఈ సినిమాలో మందిరా బేడీ ని ఓ కీలక పాత్ర కోసం తీసుకున్నారు కానీ ఆ పాత్రకు ఆమె న్యాయం చేయకపోవడంతో మందిరా ను తొలిగించి
రమ్యకృష్ణ ను తీసుకున్నారు. నూతన దర్శకుడు
అనిల్ పడూరి తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి
సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తుండగా
కేతిక శర్మ ,
ఆకాష్ కు జోడిగా నటిస్తుంది. కాగా కేతికకు ఇదే మొదటి సినిమా.
ఇక
రొమాంటిక్ తో ఎలాగైనా
ఆకాష్ కు సూపర్ హిట్ ఇవ్వాలని పట్టుదలతో వున్నాడట
పూరి అంతేకాదు ఈచిత్రానికి కథ , స్క్రీన్ ప్లే ,మాటలు కూడా
పూరి జగన్నాథే అందిస్తున్నాడు. ఇదిలావుంటే గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమైన పూరి ఎట్టకేలకు గత ఏడాది
ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి సత్తా చాటాడు. ప్రస్తుతం
పూరి,
విజయ్ దేవరకొండతో
ఫైటర్ అనే
సినిమా చేస్తున్నాడు.