రిచా గంగోపాధ్యాయ్.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లీడర్ సినిమాలో రానా సరసన హీరోయిన్‌గా నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్ ఈమె.. ఆ తరువాత రవి తేజతో మిరపకాయ్, సారొచ్చారు, ప్రభాస్ తో మిర్చి, వెంకటేష్ తో నాగవల్లి సినిమాలు చేసి ఇండస్ట్రీలో తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి రిచా గంగోపాధ్య. 

 

హీరోయిన్ చేసింది కొన్ని సినిమాలు అయినప్పటికీ స్టార్ హీరోలతో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. మంచి గుర్తింపు తెచ్చుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కు వచ్చిన ఈ భామ కెరీర్ మంచి స్టేజిలో ఉన్నప్పుడే సినిమాలకు గుడ్ బై చెప్పి అభిమానులకు షాక్ ఇచ్చింది. ఎందుకు ఈ షాక్ ఇచ్చింది అని అందరూ గుసగుసలు ఆడుతున్న సమయంలో పైచదువుల కోసం విదేశాలకు వెళ్లిపోయింది అని. 

 

అలాంటి ఈ స్టార్ హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ్ తెలుగు సినిమాల్లో అలా మెరిసి ఇలా మాయం అయ్యింది. ఇక అలాంటి ఈ హీరోయిన్ అలా గుడ్ బై చెప్పిన సరే రెండు సంవత్సరాల క్రితం చదువు పూర్తి చేసుకుంది. చదువు పూర్తి అయినా వెంటనే మళ్లీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తుంది అని టాలీవుడ్ లో గుస గుసలు వినిపించాయి. కానీ ఆమె సినిమానే జీవితం అని అనుకోలేదు.. అందుకే రంగుల ప్రపంచాన్ని వదిలి ఆమె చదువుకు తగ్గట్టుగానే బిజినెస్ చేసుకుంటూ ఇండిపెండెంట్ వుమెన్ లా జీవితాన్ని గడుపుతుంది. 

 

ఇంకా ఆమె చదివే బిజినెస్ స్కూల్లో పరిచయం అయిన జోయ్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంకా అలా ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయాన్నీ కూడా ఆమె పెద్దగా హైలెట్ చెయ్యలేదురిచా గంగోపాధ్యాయ్. రంగే ప్రపంచం అని అనుకునే హీరోయిన్లు ఉన్న ఈ కాలంలో చదువుకున్నాను.. ఆ చదువుకు తగ్గ పని నేను చెయ్యాలి అని తాను రంగుల ప్రపంచాన్ని వదిలి అందమైన జీవితాన్ని జీవిస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: