ప్రస్తుతం వరస పరాజయాలతో సతమతమైపోతున్న బాలకృష్ణ బోయపాటి శ్రీను దర్శకత్వంలో చేస్తున్న సినిమా పై బాలయ్య అభిమానులలో చాల మంచి అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో రెండు డిఫరెంట్ పాత్రలలో కనిపించబోతున్న బాలకృష్ణ నటించే అఘోరా పాత్ర ఈ మూవీకి హైలెట్ కాబోతోంది. కరోనా ఎఫెక్ట్ తో ప్రస్తుతం షూటింగ్ ఆగిపోయిన ఈమూవీలోని బాలకృష్ణ పాత్రలకు బోయపాటి మరింత శ్రద్ధ తీసుకుని స్క్రిప్ట్ లో ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. 


ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా బాలకృష్ణతో మళయాళంలో హిట్ అయిన  ‘అయ్యప్పనన్ కోషియమ్’ సినిమాను తెలుగులో రీమేక్  చేయడానికి ఇప్పటికీ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ మూవీ కథ పట్ల బాలయ్య పెద్దగా ఆసక్తి కనపరచక పోవడంతో ఈ మూవీని తెలుగులో రీమేక్ చేయాలి అని ప్రయత్నిస్తున్న సితార ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ప్రయత్నాలు పెద్దగా ముందుకు సాగడంలేదు. 


ఇలాంటి పరిస్థితులలో ఈ సంస్థ నిర్మాతలు అర్జున్ రెడ్డి ఫేమ్ సందీప్ వంగాను రంగంలోకి దింపి ఈ రీమేక్ లో నటించడానికి బాలయ్యను ఒప్పించగలిగితే ఈ మూవీ దర్శకత్వ బాధ్యత సందీప్ వంగాకు ఇస్తామని రాయబారాలు చేస్తున్నట్లు టాక్. ఇప్పటికే ఈ మూవీలో బాలయ్య నటించదానికి ఒప్పుకుంటే రానా మరొక హీరోగా నటించడానికి ప్రాధమికంగా అంగీకరించడంతో సందీప్ వంగా తన మాటల మాయతో బాలకృష్ణను ఈ రీమేక్ లో నటించడానికి ఒప్పించే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 


వాస్తవానికి బాలకృష్ణ గతంలో కాకుండా తన సినిమాలను చాల పవర్ ఫుల్ గా డిఫరెంట్ గా తీయగల దర్శకుల వైపు చూస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో సందీప్ వంగా రాయబారం విజయవంతం అయితే ఒక క్రేజీ డైరెక్టర్ దర్శకత్వంలో మరో సినిమా బాలయ్య నుంచి వచ్చే ఆస్కారం ఉంది. అయితే సందీప్ రెడ్డి రణ‌్‌బీర్ కపూర్ సినిమాకు కమిట్ అయిన పరిస్థితులలో ఈ ప్రయత్నాలు ఎంత వరకు విజయవంతం అవుతాయి అన్నది రానున్న కాలంలో తేలుతుంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: