మాస్ మహారాజా రవితేజ హిట్ ప్లాపులతో సంభంధం లేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. తన కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రవితేజ - గోపిచంద్‌ మలినేనిల కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన 'డాన్‌ శీను' 'బలుపు' చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ అంచనాలను పెంచేసింది. మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న 'క్రాక్' చిత్రాన్ని ఈ ఏడాది స‌మ్మ‌ర్లో సినిమాను విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది. కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. 

 

ఇదిలా ఉండగా రవితేజ - డైరెక్టర్ త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో ఒక చిత్రం తెరకెక్కనున్నదని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.  'సినిమా చూపిస్తా మావా' 'నేను లోకల్' వంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్న త్రినాథరావు నక్కిన చెప్పిన స్టోరీ రవితేజకు నచ్చిందట. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని సమాచారం. అయితే ఈ సినిమాలో స్టోరీని మలుపుతిప్పే రోల్ ఉండబోతోందట. ఆ క్యారెక్టర్ కోసం మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ పేరును చిత్ర యూనిట్  పరిశీలిస్తున్నారట. సినిమాలో ఎంతో కీలకమైన ఈ పాత్రకు తేజ్ అయితే కరెక్ట్‌ గా సరిపోతాడని దర్శకనిర్మాతలు భావిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే సాయి ధరమ్ తేజ్ తో సంప్రదింపులు జరుపుతున్నట్లు కూడా టాక్‌ వినిపిస్తోంది. కాకపోతే 'చిత్ర లహరి' 'ప్రతిరోజూ పండగే' సినిమాలతో సక్సెస్ లతో ఊపు మీదున్న సాయి ధరమ్ తేజ్ ఇలాంటి పాత్రలలో నటించడానికి ఒప్పుకుంటాడా అనేది చూడాలి. మరి ఇందులో నిజమెంతో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: