మన తెలుగులో స్టార్ హీరోయిన్ అవుతుంది అని భావించిన వారిలో మమతా మోహన్ దాస్ ఒకరు. ఆమెకు మన తెలుగులో మంచి ఆఫర్లు వచ్చినా సరే ఆమె మాత్రం చేసినా సరే వాటిలో ఆమె నటన కు మంచి పేరు తెచ్చుకోలేదు. ఆ ఆఫర్ల విషయంలో ఆమె కేర్ లెస్ గా ఉండటం తో ఆమెకు మంచి ఆఫర్లు రాలేదు అని కొందరు అంటున్నారు. ఆమెకు వెంకటేష్ తో నాగార్జున తో చిరంజీవి తో సినిమా ఆఫర్లు వరుసగా వచ్చినా సరే ఆమె కేవలం కొందరు హీరోలతో మాత్రమే ఆమె సినిమా లు చేసింది అని అర్ధమవుతుంది. ముఖ్యంగా ఆమె వెంకటేష్ తో రెండు సినిమాలు చేసింది. 

 

ఈ రెండు సినిమాలు కూడా ఆమెకు మంచి పేరు తీసుకొచ్చాయి. అయితే క్యాన్సర్ కారణం గా ఆమె సినిమాలను ఎక్కువగా చేయలేకపోయింది. నటన మీద కూడా ఆమె అందుకే దృష్టి పెట్టలేదు అని కొందరు కామెంట్స్ చేసారు. నటన మీద ఆమె ఫోకస్ చేయలేక ఆఫర్లు వచ్చినా సరే వదులుకుంది అని కొందరు అప్పట్లో వార్తలు కూడా రాసారు. ఇక ఇది పక్కన పెడితే ఆమె క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకుని ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది కూడా. ఆమెను ఇప్పుడు తల్లి పాత్రలకు దర్శక నిర్మాతలు అడుగుతున్నారు. 

 

ఆమె ఆ ఆఫర్లు చేస్తుందా లేదా అనేది చూడాలి. ఇక ఆమె సింగర్ గా మంచి గుర్తింపు కూడా ఉంది. బాలీవుడ్ లో కొన్ని పాటలు పాడే ఆఫర్లు కూడా ఆమెకు వచ్చినట్టు సమాచారం. మన తెలుగులో ఆమెకు ఇప్పుడు రెండు ఆఫర్లు ఉన్నాయి. ఒకటి రామ్ చరణ్ సినిమాలో మరొకటి.. వరుణ్ తేజ్ సినిమాలో. మరి ఏ సినిమాలో ఆమె కనపడుతుంది అనేది త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: