రాధాక్రిష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ లవ్ డ్రామా ఓ డియర్ తర్వాత ప్రభాస్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో రూపొందనున్న ఈ మూవీ సైన్స్ ఫిక్షన్ జోనర్ లో సాగనుందట. ఇప్పటి వరకూ ఇండియన్ స్క్రీన్ పై చూడని అద్భుతాన్ని ఈ సినిమాలో చూడబోతున్నామని ప్రచారం జరుగుతుంది. అయితే అదలా ఉంటే ఈ సినిమాలో రానా విలన్ గా కనిపించనున్నట్లు వార్తలు వచ్చాయి.

 

అయితే అలాంటి ఫుల్ స్టాప్ పడేలా నాగ్ అశ్విన్ సొషల్ మీడియా ద్వారా ఒక విషయాన్ని షేర్ చేసుకున్నాడు. సోషల్ మీడియా ద్వారా ఓ నెటిజన్, క్యాస్టింగ్ కంప్లీట్ అయిపోయిందా, ఎక్కడివరకూ వచ్చిందన్న ప్రశ్నకి సమాధానమిచ్చిన నాగ్ అశ్విన్ ఇలా అన్నాడు. స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. ఇంకా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి కాలేదు. లాక్డౌన్ వల్ల స్క్రిప్టుకి మరింత సమయం దొరికింది. 

 

నటీనటులని ఇంకా ఎంపిక చేయలేదు. ఈ చిత్రంలోని కీలక పాత్రల కోసం క్యాస్టింగ్ గా ఎవర్ని తీసుకోవాలో అని కొన్ని ఐడియాలు ఉన్నాయి, కానీ ఇప్పటివరకూ ఎవర్ని ఫైనల్ చెయ్యలేదు. ఇంకా టైం పడుతుంది. ఇప్పుడే ఏమీ చెప్పలేనని బదులిచ్చాడు. దీంతో ఈ సినిమాలో రానా ఉన్నాడన్న వస్తున్న వార్తలో నిజం లేదని తేలిపోయింది. ప్రస్తుతానికి ఇంకా చర్చల దశలోనే ఉండడంతో ఎవర్నీ తీసుకోనున్నారనేది అంచనా వేయలేం.

 


ఇకపోతే ఈ సినిమా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో రూపొందనుంది. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ సినిమా ఉంటుందని నాగ్ అశ్విన్ ఇంతకుముందే చెప్పాడు. టైమ్ ట్రావెలర్ నేపథ్యంలో కథాంశం ఉంటుందని వార్తలు వస్తున్న కారణంగా సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది. లాక్డౌన్ పూర్తయితే ఈ సినిమా నుండి ఎలాంటి విషయాలు బయటకి రావు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: