మనకు 'ఇంట గెలిచి రచ్చ గెలువు' అనే నానుడి ఎప్పట్నుంచో తెలిసిందే. కానీ ఈ బ్యూటీ మాత్రం 'రచ్చ గెలిచి తర్వాత ఇంట గెలిచింది'. తెలుగు రాష్ట్రంలో పుట్టి తమ టాలెంట్ ను వేరే సినిమా ఇండస్ట్రీలో నిరూపించుకొని తిరిగి టాలీవుడ్ కు వచ్చిన తారలు ఎందరో ఉన్నారు. అలాంటి వాళ్లలో అదితి రావు హైదరి కూడా ఒకరు. 2006లో 'ప్రజాపతి' అనే మలయాళంలో సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అదితి.. 'ఢిల్లీ 6' తో బాలీవుడ్ కి వెళ్ళింది. 'యా శాలి జిందగీ', 'రాక్ స్టార్', 'కూబ్సూరత్', 'వాజిర్', 'భూమి', 'పద్మావత్' చిత్రాలతో తనను తాను నిరూపించుకుంది. 'సమ్మోహనం' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. సమ్మోహనం మంచి విజయం సాధించడంతో దర్శక నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న తమిళ, తెలుగు ద్విభాషా చిత్రం 'నవాబ్'లో ముఖ్య పాత్రను పోషించింది అదితి రావు హైదరి. వరస విజయాలతో దూసుకుపోతున్న అదితి రావు హైదరి లక్కీతారగా మారింది. ఉదయనిధి స్టాలిన్ తో మిస్కిన్ దర్శకత్వంలో 'సైకో' సినిమాలో నటించింది. సోషల్ మీడియాలో ఈమెకు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈమె పోస్ట్ చేసే హాట్ ఫోటోల కోసం యువత ఆరటంగా ఎదురు చూస్తూ ఉంటారు.
హైదరి ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా తెరకెక్కుతున్న 'వి' సినిమాలో నటిస్తున్నది. అయితే ఈ బ్యూటీ ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతుందట. ఆమె క్యారెక్టరైజేషన్ వినూత్నంగా ఉండబోతుందని తెలుస్తోంది. మరి నానికి జోడిగా నటిస్తోందా లేక ఆమెది సెపెరేట్ క్యారెక్టరా అనేది తెలియాల్సి ఉంది. అన్నట్లు నేచురల్ స్టార్ నాని కూడా విలన్ గా నటిస్తున్నాడు. మొత్తానికి ఇప్పటివరకూ ఇంద్రగంటి నానితో చేసిన రెండు చిత్రాల్లో నానిని డిఫరెంట్గా చూపించి సక్సెస్ కొట్టాడు. మళ్ళీ ఇప్పుడు నానిని మరో డిఫరెంట్ క్యారెక్టర్ లో ఆవిష్కరిస్తున్నాడు. అలాగే సుధీర్బాబుతో సమ్మోహనం వంటి బ్యూటీఫుల్ లవ్స్టోరీని తెరకెక్కించిన ఇంద్రగంటి ఈసారి సుధీర్ ను పవర్ ఫుల్ పోలీస్ రోల్ లో చూపిస్తున్నాడు. హిట్ సినిమాల నిర్మాత దిల్రాజు శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో శిరీష్, హర్షిత్ రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. కాగా గత కొన్ని రోజులుగా ఈ సినిమా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబావుతోందని వార్తలు వస్తున్నాయి.