జీవితంలో ఎవరు స్థిరపడినా అది పెళ్లితోనే. ఇందుకు సినిమాల్లో నటించే హీరో, హీరోయిన్లకు మినహాంయింపు ఏమీ లేదు. హీరోలు పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నటిస్తూ ఉంటారు. హీరోయిన్లు కొందరు పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోతారు. మరికొందరు క్యారెక్టర్ పాత్రలు చేస్తారు. తెలుగు తెరపై అగ్ర హీరోయిన్ గా రాణించింది సీనియర్ హీరోయిన్ సంఘవి. కాస్త లేటే వయసులో బిజినెస్ మ్యాన్ వెంకటేశ్ ను వివాహం చేసుకున్న సంఘవి ఇటివలే ఓ పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో తెలిపింది.
సంఘవి తన పాపతో ఉన్న ఫోటోలను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. మదర్స్ డే సందర్భంగా తన ముద్దుల కూతురుతో ఉన్న ఫోటోను షేర్ చేసి తల్లిని అయినందుకు సంతోషంగా ఉంది అని తన వాల్ లో లో రాసుకుంది. ఈ పిక్ నెట్టింట్లో వైరల్ అయింది. నెటిజన్ల నుంచి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సంఘవికి కంగ్రాట్స్ మెసెజెస్ చేస్తూ ఆమెకు పోస్ట్ చేశారు. తెలుగులో అగ్ర హీరోలందరితో నటించింది. తమిళ్, కన్నడ భాషల్లో కూడా పలు సినిమాలు చేసింది. ప్రస్తుతం పలు రియాలిటీ షోస్ కు జడ్జిగా కూడా చేస్తోంది.
సురేశ్ బ్యానర్ లో శ్రీకాంత్ హీరోగా వచ్చిన తాజ్ మహల్ సినిమాతో పరిచయమైంది సంఘవి. చిరంజీవితో మృగరాజు, బాలకృష్ణతో సమరసింహారెడ్డి, నాగార్జునతో సీతారామరాజు, వెంకటేశ్ తో సూర్యవంశం, సరదా బుల్లోడు వంటి సినిమాల్లో నటించింది. తమిళ్ లో శరత్ కుమార్, విజయ్.. లతో నటించింది. అగ్ర హీరోలతో సోలో హీరోయిన్ గా చేయలేకపోయినా సెకండ్ హీరోయిన్ గా ఇంపార్టెంట్ రోల్స్ చేసింది. పదేళ్ల పాటు ఆమె కెరీర్ కొనసాగింది.
View this post on InstagramHappy Mother’s Day# yep 😍she is my little #angel #😇 blessed to be a #mother #