నిశ్శబ్దం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలకానుందని గత కొన్ని రోజుల నుండి వార్తలు వస్తున్నాయి. తాజాగా అమెజాన్ ప్రైమ్ అన్ని భాషలకు గాను ఈసినిమా డిజిటల్ హక్కులను 26కోట్లకు దక్కించుకోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. అయితే మేకర్స్ గాని ప్రైమ్ గాని ఇప్పటివరకు విడుదలపై ఎలాంటి ప్రకటన చేయలేదు కానీ ఈ సినిమా నిర్మాతల్లో ఒకరైన ప్రముఖ రచయిత కోన వెంకట్ తాజాగా చేసిన ట్వీట్ తో మాత్రం నిశ్శబ్దం డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ కాదని  తెలుస్తుంది.

చాలా ప్యాషన్ తో,ఎన్ని కష్టాలుపడి సినిమా ఇండస్ట్రీకి వచ్చిన మనకు ..థియేటర్స్ లో మన పని పట్ల ప్రేక్షకులనుండి వచ్చే స్పందనే మనకు ప్రేరణ అదే మనుకు ఆక్సిజన్. ఆఅనుభూతికి ఏదీ సరితూగదు సినిమా అంటే సినిమా హాళ్లు.. అదే మా ప్రాధాన్యత అని కోన ట్వీట్ చేశాడు. సో ఈ ట్వీట్ తో నిశ్శబ్దం డైరెక్ట్  ఓటిటి విడుదలేనట్లే.

సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంలో హేమంత్ మధుకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో అనుష్కతో పాటు మాధవన్ ప్రధాన పాత్రలో నటించగా అంజలి ,షాలిని పాండే , సుబ్బరాజు ,మైఖేల్ మాడిసన్ ముఖ్య పాత్రల్లో నటించారు. గోపి సుందర్ సంగీతం అందించాడు. తెలుగు తోపాటు ఈచిత్రం హిందీ , తమిళ ,మలయాళ భాషల్లో విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: