టాలీవుడ్ లో ఇప్పుడు కొన్ని కొన్ని సినిమాల గురించి ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు చర్చలు జరుగుతున్న సినిమా అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప సినిమా. ఈ సినిమా గురించి అనేక వార్తలు ఇప్పుడు అభిమానులను అలరిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్ కేవలం టాలీవుడ్ స్టార్ హీరో మాత్రమే కాదు.. అల్లు అర్జున్ రేంజ్ సౌత్ ఇండియా రేంజ్కు వెళ్లి పోయింది. మనోడి సినిమా వస్తుందంటే ఇటు తెలుగులో మాత్రమే కాదు అటు కన్నడతో పాటు అర్జున్కు పిచ్చ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న మల్లూవుడ్ లో అయితే ఫ్యాన్స్ పూనకంతో ఊగిపోతూ ఉంటారు.
తాజాగా వచ్చిన వార్త ఏంటీ అంటే ఇక సోషల్ మీడియా లో తన ఫోటో లను పోస్ట్ చేయవద్దు అని చెప్పేశాడట. తాను కొన్ని రోజుల పాటు ఫోటోలకు దూరంగా ఉంటాను అని దయచేసి తన ఫోటోలను తీయవద్దు అని చెప్పాడట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని... ఈ సినిమాలో అతను తన ముఖం మీద ఘాటు తో నటించే అవకాశం ఉందని అందుకే ఏ ఫోటో కూడా విడుదల చేయవద్దు అని దాని వలన తనకు నష్టం అని చెప్పాడట. ఇక ఈ సినిమాలో అతని పాత్ర ఒక దొంగ గా స్మగ్లర్ గా ఉంటుందని కొద్ది రోజులుగా వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.
దానికి సంబంధించి ఇప్పటి నుంచే ముఖం మీద ఘాటు కోసం ప్రయత్నం చేస్తున్నాడు. అందుకే వద్దు అని చెప్పినట్టు సమాచారం. ఘాటు కోసం డాక్టర్ల బృందం ట్రై చేస్తుంది అని, బులెట్ గాయం కూడా అతని బుగ్గ మీద ఉంటుంది అని సమాచారం. కంటి దగ్గర మూడు గాట్లు ఉంటాయి అని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ ని ఇటీవల చిత్ర యూనిట్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.