టాలీవుడ్ లో కొందరు దర్శకులకు సినిమాలు హిట్ అయినా కాకపోయినా సరే డిమాండ్ అనేది ఉంటుంది. వాళ్ళ సినిమాలు ఫ్లాప్ అయిన సరే వాళ్ళతో సినిమాలు చేయడానికి నిర్మాతలు హీరోలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే దర్శకుడు క్రిష్. ఆయన అతో సినిమా చేయడానికి కొందరు స్టార్ హీరోలు కూడా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. సినిమా హిట్ ఫ్లాప్ అనే సంబంధం లేకుండా ఆయన తో సినిమాలు చేయడానికి ముందుకు వస్తు ఉంటారు. ఇప్పుడు ఆయన తో సినిమా చేయడానికి చిరంజీవి ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. 

 

రామ్ చరణ్ మలయాళం లో వచ్చి సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాను కొనుగోలు చేసి దాన్ని చిరంజీవి హీరో గా తీసుకుని రావాలి అని ప్లాన్ చేసారు. అయితే ఈ సినిమా దర్శకుడు ఎవరు అనేది ఇంకా ఖరారు కాలేదు. సినిమా కథను తెలుగుకి తగిన విధంగా మార్చాలి అని ఆయన కొందరు దర్శకులకు అవకాశం ఇచ్చారు. కాని అది ఎవరూ కూడా అంత సమర్ధంగా మార్చలేదు. దీనితో ఆయన ప్రస్తుతం ఖాళీ గా ఉన్న క్రిష్ కి ఆ ఛాన్స్ ఇచ్చారు అని సమాచారం. క్రిష్ ఇప్పుడు పవన్ తో సినిమాను చేస్తున్నారు. 

 

అయినా సరే లాక్ డౌన్ కారణంగా ఆయన ఖాళీ గా ఉన్నారు. అందుకే ఇప్పుడు ఒక కథను మార్చాలి అని చెప్పారట. రామ్ చరణ్ కూడా ఇప్పుడు క్రిష్ తో మాట్లాడారు అని తెలుస్తుంది. ఆ సినిమా కథను క్రిష్ మారిస్తే మాత్రం ఆయన తోనే సినిమాను చేసే అవకాశం ఉందని సమాచారం. క్రిష్ కి ఏ విధంగా ఉండాలి అనే సూచనలను కూడా చిరంజీవి చేసారు. దీనిపై త్వరలోనే ఒక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: