మన తెలుగులో కొందరు హీరోయిన్ లకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాలు సినిమాలు చేసినా చేయకపోయినా సరే వాళ్ళ గురించి మాత్రం ఎప్పుడు కూడా ఏదోక వార్త మన౦ వింటూనే ఉంటాం. అందులో ప్రధానంగా చెప్పుకునే హీరోయిన్ నయనతార. అమే మన తెలుగులో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగింది. ఆమె సినిమాలకు కూడా మంచి ఆదరణ అనేది వచ్చింది. అయితే గత కొన్ని రోజులుగా ఆమె సినిమాలకు మన తెలుగులో మాత్రం చాలా వరకు దూరంగా ఉంది. ఇప్పుడు ఎక్కువగా తమిలమలోనే సినిమాలను చేస్తుంది. 

 

మన తెలుగులో దాదాపుగా సినిమాలకు గుడ్ బై చెప్పింది అని అంటున్నారు. మరి కారణం ఏంటీ అనేది స్పష్టంగా తెలియదు గాని ఆమె మాత్రం తెలుగులో సినిమాలకు గుడ్ బై చెప్పినట్టు సమాచారం. అయితే చిరంజీవి హీరోగా రామ్ చరణ్ నిర్మాణ సారధ్యంలో వచ్చే లూసిఫర్ అనే సినిమాలో ఆమెను హీరోయిన్ గా నటించాలి అని చిత్ర యూనిట్ అడిగినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో ఆమె అయితే బాగుంటుంది అని చిరంజీవి స్వయంగా ఆమెను అడిగారు అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది చూడాలి అంటే ఎదురు చూడాలి. 

 

ఆమె చిరంజీవి ప్రధాన పాత్రలో వచ్చిన సైరా సినిమాలో కీలక పాత్రలో నటించారు. ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు గాని నయనతార పాత్రకు మాత్రం మంచి పేరు వచ్చింది. ఇప్పుడు తెలుగులో చిరంజీవి పక్కన చేసే హీరోయిన్ లు ఒకటికి పది సార్లు ఆలోచన చేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఒకటికి పది సార్లు ఆలోచన చేసి హీరోయిన్ లను ఎంపిక చేస్తున్నారు. తన పక్కన నయనతార అయితే బాగుంటుంది అని చిరంజీవి రామ్ చరణ్ కి చెప్పారు అని టాక్.

మరింత సమాచారం తెలుసుకోండి: