ప్రపంచంలో కరోనా వైరస్ రాకతో అనుకున్నవి అన్నీ ఒక్కసారిగా తలకిందులయ్యాయి. వైరస్ రాకముందు చాలామంది ఫ్యూచర్ ప్లాన్ లు తెగ వేసుకున్నారు. అది చేయాలని ఇది చేయాలంటే ఈ విధంగా నడుచుకోవాలని రకాలుగా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకున్నారు. కానీ అనూహ్యంగా కరోనా వైరస్ సెంటర్ కావడంతో పూర్తిగా అందరి ప్లాన్లు కనుమరుగై పోయింది. ఇండస్ట్రీలో కూడా ప్రస్తుతం ఈ విధంగానే పరిస్థితి మారింది. వేసవి సీజన్ కాబట్టి ఎన్నో సినిమాలు విడుదల చేయాలని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా కరోనా వైరస్ రావటంతో అందరి ఆలోచనలు అంచనాలు తలకిందులయ్యాయి. సరిగ్గా ఎగ్జామ్స్ పూర్తయిన తరువాత సీజన్ స్టార్ట్ అవుతుంది అన్న సమయంలో కరోనా వైరస్ రావడంతో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో ఏం చేయలేని పరిస్థితి నెలకొంది.

 

ఎక్కడికి అక్కడ షూటింగ్ లో సినిమాలు మొత్తం ఆగిపోయాయి. పరిస్థితి పూర్తిగా మారిపోవటం తో తెలీదా కావాల్సిన సినిమాలకు కొత్త డేట్స్ ఫిక్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తున్న 'ఆచార్య' ముందుగా దీపావళి అక్టోబర్ మాసంలో రిలీజ్ చేయాలని భావించిన తాజాగా సంక్రాంతి పండుగకు రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. కాగా ఈ సినిమాలో రామ్ చరణ్ మరియు చిరంజీవి కలిసి ఒక ఫైట్ చేయబోతున్నారట.

 

ఆ సీన్ థియేటర్లో చూస్తే మెగా అభిమానులకు పూనకాలే అని టాక్. హాయ్ క్వాలిటీ తో కొరటాల ఈ ఫైట్ చూపించబోతున్నారట. ఇదిలా ఉండగా సంక్రాంతి పండుగకు మెగాస్టార్ చిరంజీవి తో పాటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన “వకీల్ సాబ్” సినిమా కూడా రిలీజ్ కానున్నట్లు ఇండస్ట్రీ నుండి అందుతున్న సమాచారం. దీంతో ఒక్కసారిగా చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ సినిమాలు సంక్రాంతి సీజన్ లో రాబోతున్న తరుణంలో అన్నదమ్ములు సంక్రాంతి బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు సృష్టించడానికి రెడీ అవుతున్నట్లు అర్థం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: