టాలీవుడ్ లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. కాంబినేషన్ తోనే బాక్సాఫీస్ కు కిక్ ఇచ్చే సినిమాకు స్క్రిప్టులు సిద్ధమవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తోన్న పంచ్ ఫుల్ కాంబోలో ఓ మూవీ రాబోతోంది. 

 

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ కు ఫుల్ క్రేజ్ ఉంది. ఈ ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి బాక్సాఫీస్ బరిలో దిగితే, పవన్ ఫ్యాన్స్ కు ఫుల్ ఎనర్జీ వస్తుంది. పంచ్ మాస్టర్ డైలాగులు, పవన్ కళ్యాణ్ యాక్షన్ కలిసి తమని ఫుల్లుగా ఎంటర్ టైన్ చేస్తుందని ఫ్యాన్స్ అంతా ఎక్స్ పెక్ట్ చేస్తుంటారు. వాళ్ల అంచనాలను నిజం చేసేందుకు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు పవన్-త్రివిక్రమ్. 

 

పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇద్దరూ ఇప్పటికే హ్యాట్రిక్ పూర్తి చేశారు. జల్సా, అత్తారింటికి దారేది, అజ్ఞాతవాసి సినిమాలతో బరిలో దిగారు. అయితే పవన్ కళ్యాణ్ 25వ సినిమాగా వచ్చిన అజ్ఞాతవాసి అంచనాలను అందుకోలేకపోయింది. ఇక ఈ మూవీ తర్వాత పవన్ రాజకీయాల్లో బిజీ అయ్యాడు. వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు పవన్ కళ్యాణ్. 

 

పవన్ కళ్యాణ్ ఇప్పుడు మూడు సినిమాలతో బిజీగా ఉన్నాడు. లాక్ డౌన్ తో షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిన వకీల్ సాబ్ తో పాటు క్రిష్ డైరెక్షన్ లో ఓ పీరియాడికల్ మూవీ అలాగే హరీశ్ శంకర్ దర్శకత్వంలో ఓ చిత్రానికి సైన్ చేశాడు. ఈ సినిమాలు కంప్లీట్ అయ్యాక త్రివిక్రమ్ మూవీలో జాయిన్ అవుతాడట పవన్ కళ్యాణ్. ఈ లోపు జూనియర్ ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ని పూర్తి చేసుకుంటాడట త్రివిక్రమ్. మరి వీళ్లిద్దరి కాంబోలో రాబోతోన్న నాలుగో సినిమా స్టోరీ ఏంటి.. స్టార్ కాస్టింగ్ ఎలా ఉంటుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి బాక్సాఫీస్ కు కిక్ ఇచ్చేలా స్ర్కిప్ట్ లు రాబోతున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: