అదితి రావు హైదరి ..బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లలో బాగా పాపులర్ అయిన హీరోయిన్. అప్పటి వరకు బాలీవుడ్ లో చేసిన సినిమాలు ఒక ఎత్తైతే సంజయ్ దత్ తో చేసిన భూమి సినిమా తో పాటు మణి రత్నం తెరకెక్కించిన చెలియా సినిమాలతో అద్భుతమైన పేరు ని సంపాదించుకుంది. అంతకముందు కూడా ఫితూర్, మర్డర్ 3, వాజిర్, రాక్ స్టార్ లాంటి సూపర్ హిట్ సినిమాలలో నటించింది. అయితే ఏ సినిమాని ఒప్పుకున్న నటనకి ఆస్కారం ఉన్న పాత్రలే ఒప్పుకోవడం, క్యారెక్టర్ విషయం లో కాంప్రమైజ్ కాని తత్వం ఈ బ్యూటి లో గొప్ప విషయం. 

 

అయితే బాలీవుడ్ గాని టాలీవుడ్, కోలీవుడ్ .. సౌత్ అండ్ నార్త్ లో ఏ సినిమా ఇండస్ట్రీలో కమిటయ్యో సినిమా యినా అదితి రావు హైదరి టార్గెట్ స్టార్ స్టేటస్ కాదట. తను ఎంచుకున్న క్యారెక్టర్ కి వంద శాతం న్యాయం చేయడమే లక్ష్యం అని తను చేసే ప్రతీ పాత్ర చాలా కాలం గొప్పగా చెప్పుకునేదిగా ఉండాలని ఈ విషయంలో కాంప్రమైజ్ కాదని అంటున్నారు. అందుకే ప్రతీ సినిమాని ఎంతో ఆలోచించి సెలెక్ట్ చేసుకుంటుందట.

 

ఇక తెలుగులో మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో సమ్మోహనం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తెలుగులో కూడా చక్కని అభినయంతో గుర్తింపుని దక్కించుకుంది. ఇక మరోసారి మోహన్ కృష్ణ ఇంద్రగంటి రూపొందుతున్న ‘వి’ సినిమాలో అదితి రావు హైదరి నటిస్తున్న సంగతి తెలిసిందే. నాని, నివేదా థామస్, సుధీర్ బాబు నటిస్తున్నారు. అయితే హీరోయిన్స్ అందరి కంటే విభిన్నంగా ఆలోచిస్తున్న అదితి రావు హైదరి ఈ సినిమాలో నెగటివ్ రోల్ లో కనిపించబోతుంది. వాస్తవంగా సమ్మోహనం తర్వాత కొన్ని సినిమాలలో అవకాశం వచ్చినప్పటికి ఆ సినిమాలు వదులుకోవాల్సి వచ్చింది. అంతేకాదు అదితి రావు హైదరి టాలీవుడ్ లో చేసిన రెండు సినిమాలు ఇంద్రగంటి మోహన కృష్ణ వి కావడం విశేషం. 

 

ఇక ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ కావాల్సి ఉండగా లాక్ డౌన్ నేపథ్యంలో పోస్ట్ పోన్ అయింది. ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న వి సినిమాని జూలై లో రిలీజ్ చేసే వకాశాలున్నాయని అంటున్నారు. అయితే ఈ సినిమాని ఓటిటిలో రిలీజ్ చేస్తారన్న మాట కూడా వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజమో దిల్ రాజు క్లారిటి ఇస్తేగాని తెలియదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: