టాలీవుడ్ లో జూనియర్ ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమాల కోసం ప్రేక్షకులు ఏ విధంగా ఎదురు చూస్తారో అందరికి తెలుసు. అయితే అతని సినిమా వచ్చి దాదాపుగా రెండేళ్ళు అవుతుంది. 2018 ద‌స‌రా సీజ‌న్లో మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన అర‌వింద స‌మేత వీరారాఘ‌వ సినిమా త‌ర్వాత ఇప్ప‌టి వ‌ర‌కు ఎన్టీఆర్ సినిమా రాలేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ ను తెర‌మీద చూసేందుకు అర్రులు చాస్తున్నారు. 

 

ఇప్ప‌టికే ఎన్టీఆర్ ను తెర‌మీద చూసి యేడాదిన్న‌ర అవ్వ‌డంతో ఫాన్స్ లో ఒకరకంగా చికాకు అనేది ఉంది. ఇప్పుడు అతని సినిమా ఎప్పుడు వస్తుంది అంటూ అభిమానులు ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురు చూసే పరిస్థితి ఉంది. ఇక ఆర్.ఆర్.ఆర్ సినిమాను ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసారు. ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా మరోసారి వాయిదా వేసారు. ఎప్పుడు విడుదల చేస్తారు అనేది స్పష్టత రావడం లేదు. సినిమాకు సంబంధించి ఇంకా కీలక సన్నివేశాలకు సంబంధించిన షూటింగ్ పెండింగ్ లో ఉందని అందుకే సినిమా లేట్ అవుతుంది అని అంటున్నారు.  

 

అయితే ఇప్పుడు సినిమా లేట్ అవ్వడం పై జూనియర్ ఎన్టీఆర్ చాలా సీరియస్ గా ఉన్నాడు అని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాను మొదలుపెట్టే సమయంలో 2020 లో కచ్చితంగా విడుదల చెయ్యాలి అని చెప్పాడు. కాని రాజమౌళి అది ఇది అని లేట్ చేస్తున్నాడు అని దీని కారణంగా ఆ ప్రభావం తన భవిష్యత్తు సినిమాల మీద ప్రభావం పడుతుంది అనే భావన లో తారక్ ఉన్నాడట‌. బాహుబ‌లి విష‌య‌యంలో ప్రభాస్ ఇలాగే నష్టపోయాడు అని తన టైం కూడా అనవసరంగా వెస్ట్ అవుతుంది అని జక్కన్న ముందే చెప్పేసాడు అని టాక్.

 

మరింత సమాచారం తెలుసుకోండి: