టాలీవుడ్ లో నటన కు ప్రాణం ఇచ్చే హీరోలు అంటూ కొందరి గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. అందులో ప్రధానంగా చెప్పుకునే నటుడు  మహేష్ బాబు. అతని సినిమాలకు ఉండే క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సినిమా హిట్ ఫ్లాప్ అనే సంబంధం లేకుండా ఆయన తో సినిమా చేయడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. సంక్రాంతికి వ‌చ్చిన స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమా త‌ర్వాత మ‌హేష్ క్రేజ్ ఓ రేంజ్‌లో పెరిగి పోయింది. మ‌హేష్ బాబు చివ‌రి మూడు భ‌ర‌త్ అనే నేను, మ‌హ‌ర్షి. స‌రిలేరు నీకెవ్వ‌రూ మూడు సూప‌ర్ డూప‌ర్ హిట్ అయ్యాయి.

 

ఇది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. మహేష్ బాబు ఈ మధ్య కాలంలో కొత్తగా కనపడుతున్నాడు. ఆయన కొడుకు గౌతం లేదా మహేష్ బాబు అనేది చెప్పడం మహేష్ బాబు ఫోటో లు చూసి ఈ మధ్య కష్టంగా ఉంది. ఈ తరుణంలో మహేష్ బాబు కి సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. అది ఏంటీ అంటే మహేష్ బాబు ఇప్పుడు పరుశురాం సినిమా కోసం చాలా కష్టపడుతున్నాడు అని సమాచారం. స‌రిలేరు హిట్ ను కొద్ది రోజులుగా ఎంజాయ్ చేసిన మ‌హేష్ కాస్త గ్యాప్ తీసుకుని సినిమా చేయాల‌నుకున్నాడు.

 

అయితే వంశీ పైడిప‌ల్లి సినిమా క్యాన్సిల్ అయ్యింది. ఇక ప‌ర‌శురాం సినిమాను ప‌ట్టాలెక్కించే టైంలో క‌రోనా వ‌చ్చింది. ఇక ప‌ర‌శురాం సినిమాలో ఒక మానసిక రోగిగా మహేష్ బాబు నటించే అవకాశం ఉందని అందుకే మహేష్ బాబు తనని తాను ఆ విధంగా మార్చుకున్తున్నాడు అని అంటున్నారు. ఇది ఎంత వరకు నిజం అనేది తెలియదు గాని మహేష్ బాబు ఇప్పుడు బాగా సన్నబడే ప్రయత్నాల్లో ఉన్నారు అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఈ సినిమా వచ్చే ఏడాది రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: