మన తెలుగులో ఇప్పుడు దర్శకులకు మంచి డిమాండ్ అనేది వచ్చింది. దర్శక నిర్మాతలు చాలా మంది వరుసగా సినిమాలను చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు నష్టాలు ఎక్కువగా వస్తున్న నేపధ్యంలో ఈ నష్టాల నుంచి బయటపడాలి అంటే దర్శకులు అయినా సరే నిర్మాతలు అయినా మరొకరు అయినా సరే వరుసగా సినిమాలను చెయ్యాల్సి ఉంటుంది. ఇప్పుడు మన తెలుగులో కొందరు దర్శకులకు మంచి డిమాండ్ అనేది వస్తుంది. ప్రస్తుతం మన తెలుగులో మంచి డిమాండ్ ఉన్న దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. 

 

ఆయనకు మంచి డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఒక సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఆయన మరో సినిమాకు అప్పుడే గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసారు. ఆయన కోసం ఇప్పుడు హీరోలు కూడా ఎక్కువగ యెదురు చూస్తున్నారు అనే వార్తలు వస్తున్నాయి. ఇక రాజమౌళి కోసం స్టార్ హీరోలు ఎదురు చూడటం తో ఇప్పుడు ఆయనకు మంచి డిమాండ్ ఉంది అనే చెప్పుకోవచ్చు. ఇక ఆయన తర్వాత క్రిష్ కి ఎక్కువగా డిమాండ్ ఉంది. క్రిష్ కి పవన్ కళ్యాణ్ సినిమా తర్వాత బాలకృష్ణ తో సినిమా ఆఫర్ వచ్చింది. 

 

బాలయ్య తో సినిమా చేయడానికి గానూ నిర్మాతలే స్వయంగా ఆయనను అడిగారు అని సమాచారం. అందుకే ఆయన ఇప్పుడు ఆ సినిమా కథను కూడా సిద్దం చేసుకునే పని లో ఉన్నాడు అని అంటున్నారు. ఇక ఆయన తర్వాత ఎక్కువగా వినపడుతున్న పేరు అనీల్ రావిపూడి. బాబుకి సరిలేరు నీకెవ్వరు సినిమా తర్వాత మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ సినిమా తర్వాత మహేష్ బాబు ఆయనను స్వయంగా అడిగినా సరే ఆయన మాత్రం చేయడానికి అంతగా ఆసక్తి చూపించలేదు అని అంటున్నారు. ఇలా దర్శకులు అందరూ కూడా ఇప్పుడు బిజీ అయిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: