రాజమౌళి డైరక్షన్ లో ఆర్.ఆర్.ఆర్ సినిమా చేస్తున్న ఎన్టీఆర్సినిమా తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరక్షన్ లో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఈ సినిమాను హారిక హాసిని బ్యానర్ తో పాటుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ లో కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. ట్రిపుల్ ఆర్ పూర్తి చేసిన తర్వాత ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్తుంది. ఈ సినిమా పొలిటికల్ బ్యాల్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుంది. అయినను పోయి రావాలె హస్తినకు టైటిల్ ప్రచారంలో ఉంది. 

 

ఎలాగూ ఆర్.ఆర్.ఆర్ తో పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ వస్తుంది కాబట్టి త్రివిక్రమ్ సినిమాను కూడా నేషనల్ వైడ్ గా రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారట. త్రివిక్రమ్ కూడా తన పరిధి దాటి ఎప్పుడు సినిమాలు చేయలేదు. కానీ మొదటిసారి పాన్ ఇండియా సబ్జెక్ట్ తీసుకున్నాడట. ఎన్టీఆర్ కు అది బాగా నచ్చిందట. అయితే పాన్ ఇండియా సినిమా అంటే దానిలో స్టార్ కాస్ట్ కూడా అదే రేంజ్ లో ఉండాలి అందుకే సంజయ్ దత్ తో సంప్రదింపులు జరుపుతున్నారట. 

 

కెజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీ వచ్చిన సంజయ్ దత్ తో స్పెషల్ మీటింగ్ ఏర్పాటు చేశారట తారక్. త్రివిక్రమ్ సినిమాలో సంజయ్ నటించేలా చర్చలు జరిపారా. సంజూ కూడా పాజిటివ్ గా ఉన్నాడని తేలుతుంది. ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ కూడా తెలుగు సినిమాల మీద కన్నేశారు. అందుకే వారి అండతోనే బాలీవుడ్ లో చక్రం తిప్పాలని చూస్తున్నారు మన స్టార్స్. ఎలాగూ ట్రిపుల్ ఆర్ అక్కడ మరోసారి రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం. ఆ సినిమాతో వచ్చిన క్రేజ్ ను ఎన్టీఆర్ క్యాష్ చేసుకునేలా ఇక మీద తీసే సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ లో ఉండాలని చూస్తున్నాడు. త్రివిక్రమ్ తర్వాత ప్రశాంత్ నీల్ డైరక్షన్ లో సినిమా ఉంటుందని తెలుస్తుంది. అది కచ్చితంగా పాన్ ఇండియా మూవీ అని ఫిక్స్ అవ్వాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: