మళయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా రామ్. ఈ సినిమాలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. దృశ్యం వంటి సూపర్ హిట్ సినిమా తీసిన జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తోంది. అయితే ఇప్పుడీ సినిమా ఆగిపోయిందనే వార్తలు మల్లూవుడ్ లో గుప్పుమన్నాయి. మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాపై మరో గాసిప్ కూడా నడుస్తోంది. దీనిపై కొంత వివరణ ఇచ్చాడు దర్శకుడు జీతూ జోసెఫ్. ఈ సినిమా నుంచి త్రిష కూడా తప్పుకుందనే వార్త మరింత హాట్ టాపిక్ అయింది.

 

 

‘ఈ సినిమా ఆగిపోయిందంటూ రెండు మూడు రోజులుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల్లో నిజం లేదు. ఈ సినిమా షూటింగ్ మాత్రమే వాయిదా పడింది. కరోనా నేపథ్యంలో షూటింగ్ జరపలేని పరిస్థితుల్లో వాయిదే వేశాం. కథ రీత్యా లండన్, ఉజ్బెకిస్థాన్ దేశాల్లో షూటింగ్ జరపాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో షూటింగ్ జరిపే అవకాశం లేదు. ఈ సినిమాను కేరళలోనే పూర్తిగా షూటింగ్ చేయలేము. ఆయా దేశాల్లో పరిస్థితులు చక్కబడ్డాక, అనుమతులు వచ్చాక రామ్ చిత్ర షూటింగ్ మళ్లీ ప్రారంభిస్తాను’ అని జీతూ తన ఫేస్ బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశాడు. అయితే.. ఇప్పుడు ఈ సినిమాలో త్రిష నటిస్తుందా అనే అనుమానాలు మొదలయ్యాయి.

 

 

రామ్ మూవీ నిరవధికంగా వాయిదా పడ్డ నేపథ్యంలో ఈ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు ప్రారంభమయ్యేదీ చెప్పడం కష్టమే. దీంతో ఈ సినిమాలో త్రిష నటించేది అనుమానమే అంటున్నారు. తమిళ్ లో మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వంకు డేట్స్ కేటాయించిన త్రిష అప్పటి పరిస్థితులకు రామ్ కు మళ్లీ డేట్స్ కేటాయించేది కష్టమే అంటున్నారు. మరి.. దీనిపై త్రిష కానీ జీతూ కానీ అఫిషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందే.

In the last two three days I have been getting calls and messages asking whether I have shelved my mohanlal movie 'RAM'...

Posted by Jeethu Joseph on Monday, 18 May 2020

మరింత సమాచారం తెలుసుకోండి: