మన తెలుగులో యువ హీరోలు ఈ మధ్య కాలంలో ప్రేమలో ఎక్కువగా పడుతున్నారు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతుంది. నిజం ఎంత వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే సోషల్ మీడియా లో మాత్రం ఈ ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. ఇందులో వాస్తవ అవాస్తవాలు ఎలా ఉన్నా కొందరు యువ హీరోలు తరచూ సింగర్ల తో చాలా క్లోజ్ గా మూవ్ అవుతోన్న నేపథ్యంలోనే ఈ గాసిప్స్ ఎక్కువుగా ప్రచారంలోకి రావడం కామన్ అయ్యింది.
ఇక సింగర్లు .. యువ హీరోల గురించి ఏ చిన్న వార్త వచ్చినా సరే దాని గురించి అనేక ప్రచారాలు చేయడం అనేది ఈ మధ్య కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉంది అనే విషయం అర్ధమవుతుంది. ఇది ఇలా ఉంటే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. టాలీవుడ్ లో యువ హీరో ఒకరు బాలీవుడ్ లో ఉండే సింగర్ తో ప్రేమలో పడ్డాడు అని అంటున్నారు. ఆమె కోసం అతను ముంబై వెళ్ళాలి అని చూస్తే లాక్ డౌన్ లో ఉందని అక్కడ కరోనా కేసులు ఎక్కువగా ఉన్నాయని వెళ్ళకుండా ఉండటం మంచిది అని తండ్రి వార్నింగ్ ఇచ్చాడని అంటున్నారు.
ఆమె కుటుంబం లో ఒకరికి కరోనా వచ్చింది అని తెలుసుకున్న సదరు యువ హీరో ముంబై వెళ్ళడానికి ప్రయత్నాలు చేయగా సదరు హీరో కుటుంబం లో వాళ్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేసారని సమాచారం. ఇక వీరిద్దరు ఇప్పటికే రిలేషన్ లో కూడా ఉండడంతో వీరి పెళ్లికి కూడా ఇరువైపులా ఉన్న కుటుంబ సభ్యులు కూడా వీరి పెళ్లికి ఓకే చెప్పారట. ఇప్పుడు కరోనా.. లాక్ డౌన్ నేపథ్యంలో వ్యవస్థులు అన్ని స్తంభించి పోయాయి. ఈ క్రమంలోనే ఈ కరోనా హడావిడి తగ్గాక వీరి పెళ్లిపై అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు.