ఇప్పుడు మన తెలుగులో కొన్ని కొన్ని సినిమాలకు ఆదరణ పెరిగింది అనేది వాస్తవం. అందులో ప్రధానంగా చెప్పుకునే సినిమాలు బయోపిక్ లు. బయోపిక్ సినిమాల కోసం దర్శక నిర్మాతలు హీరోలు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీనితోనే హీరోలు అందరూ కూడా ఇప్పుడు బయోపిక్ సినిమాల మీద దృష్టి పెట్టి టాలీవుడ్ లో ప్రముఖులు అయిన వారి సినిమాలను సెట్స్ మీదకు తీసుకుని వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. ఇది ఎంత వరకు నిజం అనేది పక్కన పెడితే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. 

 

అది ఏంటీ అనేది చూస్తే మెగా హీరో సాయి ధరం తేజ్ ఒక బయోపిక్ చేస్తున్నాడు అని అంటున్నారు. ఎంత వరకు నిజం అనేది త్వరలోనే తెలుస్తుంది. ఈ బయోపిక్ కోసం అతను ఒక దర్శకుడి తో కూడా మాట్లాడినట్టు సమాచారం. ఆ బయోపిక్ ఎవరిది అంటే... ఒక మాజీ సైనికుడి జీవిత కథ ఆధారంగా తీసుకుని వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు అని సమాచారం. దీనికి ప్రముఖ దర్శకుడు తేజా దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అన్నీ అనుకున్న విధంగా జరిగితే ఈ సినిమాలో చిరంజీవి కూడా నటించే సూచనలు ఉన్నాయని తెలుస్తుంది. 

 

మరి ఈ సినిమాను సెట్స్ మీదకు ఎప్పుడు తీసుకుని వెళ్తారా అనేది ఇంకా స్పష్టత రావడం లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన చర్చలు అన్నీ కూడా దాదాపుగా జరిగాయని అంటున్నారు. నిర్మాతగా దిల్ రాజు వ్యవహరించే అవకాశం ఉందని సమాచారం. మరి చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక ఇది పక్కన పెడితే అతను నటించిన ఒక సినిమా ఇప్పుడు విడుదలకు నోచుకోలేదు లాక్ డౌన్ కారణంగా ఇంట్లో ఖాళీ గా ఉన్న సాయి ఇప్పుడు దీని మీద దృష్టి పెట్టాడు అని సమాచారం. .

మరింత సమాచారం తెలుసుకోండి: