టాలీవుడ్ లో రమ్యకృష్ణ కు ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె తో సినిమాలు చేయడానికి బాహుబలి సినిమా నుంచి కూడా దర్శక నిర్మాతలు ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఆమె తమ సినిమాలో నటిస్తే చాలు సినిమా హిట్ అవుతుంది అనే భావన లో దర్శక నిర్మాతలు ఉన్నారు అనే ప్రచారం కొన్ని రోజులుగా జరుగుతుంది. కథ ఏ విధంగా ఉన్నా సరే ఆమె ఉంటే చాలు సినిమా ముందుకు కచ్చితంగా వెళ్తుంది అనే భావన లో ఉన్నారు అని అంటున్నారు. టాలీవుడ్ లో ఏ మాజీ హీరొయిన్ కి కూడా ఈ స్థాయిలో గుర్తింపు లేదు అనేది వాస్తవం. 

 

ఆమెకు ఇప్పుడు చాలా అవకాశాలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు ఆమెను పుష్ప సినిమా తో పాటుగా చిరంజీవి ఆచార్య సినిమాలో కూడా ఒక పాత్ర కోసం అడిగారు అని సమాచారం. ఆమె అందుకు ఓకే చెప్పింది అని తెలుస్తుంది. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కి అమ్మగా ఆమె నటించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. దీనిపై త్వరలోనే ఒక స్పష్టత కచ్చితంగా వస్తుంది అని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఆమె నటించడం దాదాపుగా ఖాయం అయింది అని సమాచారం. 

 

కథలో తన పాత్ర గురించి ఆమె కొన్ని మార్పులు కూడా చెప్పింది అని దానికి చిత్ర యూనిట్ కూడా ఓకే చెప్పింది అని తెలుస్తుంది.అన్నీ అనుకున్నట్టు జరిగితే లాక్ డౌన్ తర్వాత ఆమె ఆ సినిమా షూటింగ్ లో పాల్గొనే అవకాశం ఉంది.ప్రస్తుతం మన తెలుగులో ఆమెకు మంచి డిమాండ్ ఉంది. మరో రెండు మూడు సినిమాలకు కూడా ఆమెను అడిగారు అని అంటున్నారు. మరి ఏ సినిమాల్లో ఆమె నటిస్తుంది అనేది చూడాలి. త్వరలోనే స్పష్టత వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: