ఇప్పుడు టాలీవుడ్ లో తిరిగి అడుగు పెట్టడానికి కొందరు హీరోయిన్ లు చాలా వరకు కష్టాలు పడుతున్నారు అనేది వాస్తవం. కొందరు హీరోయిన్ లు ఒక్క సినిమా చేసినా సరే చాలు అనుకునే భావన లో ఉన్నారు. అందులో ప్రధానంగా మనం చెప్పుకునే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. పాప చేసిన నాలుగు రోజులు అయినా సరే అగ్ర హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగి ఆ తర్వాత మాయం అయిపోయింది. ఒక్క ఆఫర్ కూడా ఆమెకు పెద్దగా రాలేదు అనేది తెలిసిందే. ఇప్పుడు మాత్రం ఆమె ఒక్క ఆఫర్ వచ్చినా చాలు అనుకునే విధంగా కష్టాలు పడుతుంది. 

 

అయితే ఇప్పుడు ఆమెకు త్రివిక్రమ్ ఆఫర్ ఇచ్చినట్టు సమాచారం. నానీ తో చేసే సినిమాలో ఆమెను హీరోయిన్ గా తీసుకునే సూచనలు ఉన్నాయని అంటున్నారు. నానీ సినిమాకు సంబంధించి ఇప్పుడు కథను రెడీ చేస్తూ వస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయని ఎవరిని తీసుకుంటే బాగుంటుంది అనేది నానీ ని కూడా అడిగాడు అని నానీ మాత్రం తక్కువ ఖర్చు లో అయ్యే విధంగా చూడాలి అని సలహా ఇచ్చాడు అని అంటున్నారు. 

 

అందుకే ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ తో సినిమా చేయడానికి త్రివిక్రమ్ రెడీ అయ్యాడు అని తెలుస్తుంది. ఆమె తో సినిమా చేయడానికి నానీ కూడా ఓకే చెప్పాడు అని సమాచారం. ఈ సినిమా షూటింగ్ ని లాక్ డౌన్ అయిన వెంటనే మొదలు పెట్టేసే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడు అని తెలుస్తుంది. మరి ఈ సినిమాను ఎప్పుడు విడుదల చేస్తారు అనేది తెలియకపోయినా అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది సంక్రాంతికి కచ్చితంగా విడుదల చేయడం ఖాయమని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. మరి చేస్తారా లేదా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: