ప్రస్తుతం మంచి క్రేజ్, పేరు, మార్కెట్ తో కొనసాగుతున్న టాలీవుడ్ స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా ఒకరు అనే చెప్పాలి. ముందుగా బాలరామాయణం సినిమాతో చిన్నతనంలోనే నటుడిగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, ఆ తరువాత పెద్దయ్యాక నిన్నుచూడాలని సినిమాతో హీరోగా మారారు. ఆ తరువాత వరుసగా ఒక్కొక్కటిగా తన టాలెంట్, ఆకట్టుకునే నటనతో సినిమాలు దక్కించుకుంటూ వాటిని సక్సెస్ లు గా మలుచుకుంటూ ముందుకు సాగిన ఎన్టీఆర్, కెరీర్ పరంగా నటించిన ఏడవ సినిమా అయిన సింహాద్రి సినిమాతో ఎంతో గొప్ప మాస్ హిట్ ని అందుకున్నారు. 
సినిమా తరువాత ఎన్టీఆర్ క్రేజ్ ఒక్కసారిగా ఆకాశమంత ఎత్తుకు చేరింది.

IHG

చిన్నవయసులోనే ఆ రేంజ్ పెర్ఫార్మన్స్ చేయడం అసాధ్యం అంటూ అప్పట్లో ఎన్టీఆర్ పై పలువిధాలుగా ప్రశంసలు కురిసాయి. అయితే ఆ సినిమా తరువాత విపరీతమైన అంచనాలతో పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించిన ఆంధ్రావాలా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దాని తరువాత మరొక్కసారి దర్శకుడు పూరి తో సినిమా చేయడానికి చాలానే సమయం తీసుకున్న ఎన్టీఆర్, 2015లో మళ్ళి ఆయనకు టెంపర్ సినిమా ద్వారా దర్శకుడిగా అవకాశం కల్పించారు. కాగా అంతకముందు కొన్నేళ్ల నుండి కెరీర్ పరంగా కొంత సతమతం అవుతున్న ఎన్టీఆర్ కు టెంపర్ అందించిన గొప్ప విజయం పెద్ద బ్రేక్ నే ఇచ్చింది అనే చెప్పాలి. 

 

సినిమా కథ, కథనాలు, ముఖ్యంగా ఎన్టీఆర్ డ్యాన్స్ లు డైలాగ్స్ వంటివి థియేటర్స్ లో ఎంతో అద్భుతంగా పేలాయి. అప్పటివరకు ఒక విధమైన కథలతో ముందుకు వచ్చిన ఎన్టీఆర్, టెంపర్ తరువాత కొంత డిఫరెంట్ గా కథలను ఎంచుకుంటూ ముందుకు సాగడం జరిగింది. ఆ విధంగా సింహాద్రితో పెద్ద విజయాన్నిఆ అందుకున్న ఎన్టీఆర్ కు ఆంధ్రావాలా రూపంలో పెద్ద డిజాస్టర్ ఇచ్చిన పూరి, ఆపై కెరీర్ పరంగా సతమతం అవుతున్న సమయంలో టెంపర్ తో పునర్వైభవాన్ని అందించారు అనే చెప్పాలి. కాగా వీరిద్దరి కాంబోలో మూడవ సినిమా వస్తే చూడాలని నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆశపడుతున్నారు. మరి అది ఎప్పుడు నెరవేరుతుందో ఏమో చూడాలి....!! 

 

మరింత సమాచారం తెలుసుకోండి: